TDP Formation Day Celebrated in Wanaparthy
వనపర్తి లో ఘనoగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వనపర్తి నేటిదాత్రి .
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వనపర్తి తెలుగుదేశం పార్టీ అద్యరములో వనపర్తి లో హనుమాన్ టేకిడి లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిచారు తెలుగుదేశం పార్టీ జెండాను రామన్ గౌడ్ ఆవిష్కరించారు ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ రాములు మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని గొప్ప నాయకుడు, ఎన్ టి ఆర్ అని అయన ముఖ్యమంత్రి గా ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు కమాన్ చౌరస్తాలోని పార్టీ జెండాను శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు అనంతరం వనపర్తి పట్టణ ప్రధాన రహదారుల గూండా బైక్ ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎండి దస్తగిరి రాష్ట్ర నాయకులు న్యాయ వాదీ షాకీర్ హుస్సేన్ వనపర్తి మండల నాయకులు చిట్యాల బాలరాజ్ ,అప్పా యపల్లి బాలయ్య ,ఉపేందర్ ,దాసు. పెద్దమందడి మండల నాయకులు రాధాకృష్ణ గణపురం మండల నాయకులు- యాదయ్య, శ్రీను .పెబ్బేరు మండల నాయకులు-సితార ,వాకిటి బాలరాజు, రాఘవేందర్ గౌడ్ అలాగే వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య మేదరి బాలయ్య, ఆవుల శీను, ఫారుక్ బి శేఖర్ ,శివాచారి కృష్ణయ్య ,ముక్తార్, రాజు మేస్త్రి, కొత్తగొళ్ల శంకర్ కె గిరి డి బాలరాజు తదితరులు పాల్గొన్నారు
