Chaos in Telangana Assembly Over Ponguleti Issue
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు..
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు సభలో నిరసనలు చేపట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు.
హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు సభలో నిరసనలు చేపట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. విపక్షాల నినాదాల మధ్యే ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ నేతలు సభలో గందరగోళం సృష్టించటంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అంశంపై ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత హౌస్ కమిటీ ఎందుకు? అని ప్రశ్నించారు.
