BJP Leaders Detained Ahead of Protest in Parkal
పరకాలలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు
పరకాల,నేటిధాత్రి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరకాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో సోమవారం ఉదయం పరకాల పట్టణంలో పోలీసులు ముందస్తు చర్యగా బీజేపీ నాయకులను అరెస్టు చేశారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాచం గురుప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్,9వ వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి,పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, జిల్లా నాయకుడు బాసాని సోమరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
