Goti Thalambralu Offered to Bhadrachala Ramayya
భద్రాచల రామయ్యకు గోటి తలంబ్రాలు అందచేసిన శ్రీ రామదాసు సేవ సమితి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ధర్మారావుపేట నుండి శుక్రవారం భద్రాచలం గోటి తలంబ్రాలను తీసుకెళ్లిన శ్రీ రామదాసు సేవ సమితి ఆకుల సుభాష్ ఆధ్వర్యంలో ఆలయ ఏ ఈ ఓ శ్రవణ్ కుమార్ కి అందించడం జరిగిందని.భూపాలపల్లి జిల్లా తో పాటు హన్మకొండ ములుగు జిల్లా సేవ సమితి సభ్యులు సుమారు 150 మంది ఈ తలంబ్రాల అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్నారని ఉమ్మడి జిల్లా బాద్యులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు.
తనీషా మందిరం నుండి భద్రాచలం పుర విధులలో రామ నామ స్మరణ తో శోభయాత్రగా వెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణ సీతమ్మకు చీర సారే పూలు పండ్లు రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించారన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా బాద్యులు బెనికి రాజేందర్ ఆకుల దామోదర్ కురిమిళ్ల తిరుపతి దూలం శంకర్ పనికేల వసంత జీడీ స్వర్ణలత కేశెట్టి స్వామి ములుగు జిల్లా బాద్యులు సకినాల వజ్ర రఘు ఆవుల సుశీల హన్మకొండ జిల్లా బాద్యులు నాయిని సుమలత నాగరాజు నిలబోయిన రజిత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
