Journalist Sammayya Wins Best Writer Award
ద బెస్ట్ రైటర్ అవార్డు అందుకున్న జర్నలిస్టు సమ్మయ్య
భూపాలపల్లి నేటిధాత్రి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ తాళ్లపల్లి వెంకటసమ్మయ్య గౌడ్ ను,
దబెస్ట్ రైటర్ ఆఫ్ దిఇయర్
2026 అవార్డు డాక్టర్ రమేష్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది సికింద్రాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్
లో సిటీకల్చరల్ ఆడిటోరియం వేదికపై మంగళవారం రాత్రి ఆయనకు, ఈ విశిష్ట పురస్కారం అందుకోవడంతోపాటు ఘనంగా సన్మానం చేయడం జరిగింది
31డిసెంబర్ 2024న
టివి సమ్మయ్య గౌడ్ అరుదైన గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా ,మండల కేంద్రమైన గణపురంకు చెందిన ఆయన గత 30 సంవత్సరాలకు మిoచి ఇప్పటిదాకా వివిధ పత్రికలలో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు.ఇప్పుడు కొత్తగా ఆవిర్భవించిన నారద పత్రిక కు చీఫ్ బ్యూరోగా వ్యవహరిస్తున్నారు.సుమారు 200మించిన కథలు, సామాజిక హితం కోరి, చైతన్యవంతమైన అనేక స్ఫూర్తిదాయక గేయాలు, కవితలు కూడా రాసిన
ఆయన చేసే సాహిత్య సేవను గుర్తించిన స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి,
దబెస్ట్ రైటర్ ఆఫ్ దిఇయర్ 2026గా,ఆయననీ సత్కారం అందుకున్నారు. ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరర్ అండ్ స్ఫూర్తి రీసెర్చ్ అకాడమి సంస్థ ఆయననీ అవార్డుకు ఎంపిక చేసి,శాలువతో ఘనంగా సత్కరించిoది.సంస్థ ఫౌండర్,లయన్ డాక్టర్ ఆకుల రమేష్ , ఆయనీ అవార్డుకు ఎంపిక చేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వుదయం పత్రిక, ఎడిటర్ సిరికొండ ఆగస్యన్,నారద పత్రిక సిఈఓ శ్రీనివాస్ లు అభినందించి సత్కరించారు.
