Collector and SP Call for United Action Against Child Marriages
బాల్య వివాహాలు జరుగకుండా అడ్డుకోవాలి కలెక్టర్
100 ఫిర్యాదు చేయాలి ఎస్పీ
వనపర్తి నేటిధాత్రి .
బాల్యా వివాహాలు అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.శుక్రవారం ఐ.డి. ఒ .సి ఆవరణలో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గ్రామీణ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నిర్మూలన ప్రచార వాహనానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు వనపర్తి, మహబూబ్ నగర్ గద్వాల జిల్లాలలో ఒక్కో జిల్లాలో 10 రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ బాల్య వివాహాలు చేయడం వల్ల వచ్చే అనర్థాలు,చట్ట ప్రకారం పడే శిక్షల పై విస్తృత ప్రచారం చేయనున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల అనేక అనర్థాలు జరిగే ప్రమాదాలు ఉంటాయన్నారు. పుట్టబోయే పిల్లలు శారీరక ఎదుగుదల లేకపోవడం తల్లి బిడ్డలు అనేక రోగాల బారిన పడి జీవితాలు నాశనం అయిపోతాయని తెలిపారు.బాల్య వివాహాలు చేసే వారి పై ఎలాంటి జాలి లేకుండా చట్ట ప్రకారం కఠిన శిక్షలు వేయడం జెరుతుందని అన్నారు
ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే 1098 100..112 నెంబరు కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు బాల్య వివాహం చేసే తల్లిదండ్రులతో పాటు పెళ్లి తంతులో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, పెళ్ళికి వెళ్ళే బంధు మిత్రుల పై సైతం కేసులు పెట్టడం జరుగుతోందన్నారు. జిల్లాలో ఎక్కడ బాల్య వివాహాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని చెప్పారు. అనంతరం బాల్య వివాహాలు అరికట్టేందుకు రూపొందించిన ప్రతిజ్ఞ చేశారు. సంతకాల సేకరణలో భాగంగ ప్లెక్సీ పై సంతకాలు చేశారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, ఆర్డీఎస్ కోఆర్డినేటర్ చిన్నమ్మ థామస్, ప్రోగ్రాం ఆఫీసర్ చూచేత, సహాయ ప్రోగ్రాం ఆఫీసర్ జూవెద్ ఖురేషి, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, పి.డి. డి ఆర్ డి ఓ ఉమాదేవి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి డి సి పి ఓ రాంబాబు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు ఉన్నారు
