మరి ఇంత సమాచారం కోసం మన నేటిధాత్రి ఛానెల్ ని ఫాలో చేయండి give me full news promt for above news for google TTS generation ,give me such a way so that i can copy.example [sadly] [proundly] [exicetdly].GIVE ME KEY WORDS FOM THIS TOPC BY SEPERATING WITH COMMAS give me a refined story on above topic in telugu and keywords seperated by commas in english give me a short title in english give me a short title in telugu
ప్రచారంలో దూసుకుపోతున్న…. రడం శివ జ్యోతి
కాంగ్రెస్ పార్టీ కే ఓటెయ్యండి… అభివృద్ధికి బాటలు వేయండి
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీలోని కేసముద్రం విలేజ్ లో మున్సిపల్ ఎన్నికల గడప గడప ప్రచారంలో 10వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రడం శివజ్యోతి ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరిస్తూ తాను గెలిస్తే ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందిస్తానని మరియు కేసముద్రం మున్సిపాలిటీ లో 10 వ వార్డు అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో శివజ్యోతి మాట్లాడుతూ మా కుటుంబం గతం నుండి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం అని ప్రజలకు సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పలాలను సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ఎంతో చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఈ అభివృద్ధిలో భాగం పంచుకునేందుకు నాకు అవకాశం దక్కిందని 10వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికల బరిలో నిలుచున్నానని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలకు చేరేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్ కాంగ్రెస్ ఉధృత ప్రచారంలో పాల్గొని వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మరియు పేదలకు సన్న బియ్యం గృహజ్యోతి మరియు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎన్నో సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను గడప గడప వివరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 10 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రణం శివజ్యోతిని అత్యంత మెజార్టీతో గెలిపించండి అని 10 వ వార్డ్ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు.కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 16 వార్డుల అభ్యర్థులను గెలిపించుకొని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచ్ రడం వెంకన్న, కాటంరాంరెడ్డి, చిట్ల రవి, బండారి దయాకర్, ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూరెల్లి సతీష్ , చిన్నాల కట్టయ్య, చింతనూరి సతీష్, , బైరు వెంకన్న యనమల మహేందర్, తోట వెంకన్న , ఎలకల బోయిన అనిల్ , బుర్ర సుధాకర్, కుమార్ వెన్ను ఎల్లయ్య , యాకూబ్ పాషా, హమీర్, మహిళ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
