Congress Campaign Gains Momentum in Ward 39
ప్రచారంలో దూసుకెళ్తున్న పూదరి సునీత ప్రభాకర్
39 డివిజన్ లో విజయం దిశగా కాంగ్రెస్
ప్రజల నుంచి అపూర్వ స్పందన
మంచిర్యాల , నేటి ధాత్రి న్యూస్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని 39 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూదరి సునీత ప్రభాకర్ ప్రచారంలో పాల్గొంటున్నారు.

డివిజన్ ప్రజలను నిత్యం కలుస్తూ ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటేసి తమను గెలిపించాలని కోరారు. మరోసారి తమను గెలిపిస్తే డివిజన్ సమస్యలను పూర్తిగా తీర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
