భక్తులకు ధాహం తీర్చేందుకే ఉచిత మంచినీటి వసతి ఏర్పాటు
మొగుళ్ళపల్లి ఎస్ బి ఐ బ్రాంచ్. మేనేజర్ బి. నవీన్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ముల్కలపల్లి, మొగుళ్ళపల్లి రెండు గ్రామాల మధ్య పెద్దవాగు, చిన్నవాగు ప్రవహిస్తున్న ప్రదేశం. చుపరులను కట్టిపడేసే ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో అత్యంత వైభావంగా ఆదివాసులు జరుపుకునే మేడారం సమ్మక్క సారాలమ్మ మినీ మేడారం జాతర ఉత్సవాలను కమిటీ సభ్యులు జరిపించిన నేపథ్యంలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొగుళ్ళపల్లి బ్రాంచ్ మేనేజర్ బి. నవీన్ ఫీల్డ్ ఆఫీసర్ బి రాజశేఖర్ ఆధ్వర్యంలో జాతరకు వచ్చిన భక్తులకు దాహం తీర్చేందుకు ఉచిత మంచినీటి వసతినీ ఏర్పాటు చేశారు.ఎస్ బి ఐ మేనేజర్ మాట్లాడుతూ.

గత పదిహేను సంవత్సరాలనుండి మొగుళ్ళపల్లి-ముల్కలపల్లి రెండు గ్రామాల ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించే జాతరలో భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతి ఏర్పాట్లు చేశామని భక్తజనం ఇంత పెద్ద మొత్తంలో వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడం అనందంగా ఉందని అన్నారు. అనంతరం ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ బి నవీన్,వనదేవతలైన శ్రీ సమ్మక్క , సారాలమ్మ లను ఆయన దర్శించుకున్నారు.ఉచిత మంచినీటి వసతి కల్పించడం పట్ల ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డి ఉపాధ్యక్షులు మల్సాని నరసింహారావు కొడాలిఓదెలు భక్తులు బ్యాంకు సిబ్బంది కిప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
