గంజాయి, డ్రగ్స్ అలవాటుతో దారితప్పుతున్న యువత
సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్
వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి:*
కొందరు చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి స్వార్థం కోసం విస్తరింపజేస్తున్న గంజాయి, డ్రగ్స్, గుడుంబా వంటి చెడు అలవాట్ల కారణంగా 17 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత వారి భవిష్యత్ దారితప్పి తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చితున్నారని ఈ పరిస్థితిపై గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.పౌర హక్కులు–సామాజిక సమానత్వం–యువత భవిష్యత్తే లక్ష్యంగా..గీసుకొండ మండల కేంద్రంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సీ కాలనీలో గల అంగన్వాడీ సబ్ సెంటర్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సభ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా
గీసుకొండ డిప్యూటీ తహసిల్దార్ వీందర్ రావు,టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు,
వరంగల్ జిల్లా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ మెంబర్, దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి,గ్రామ ఉపసర్పంచ్ శ్రీ కోట ప్రమోద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ మాట్లాడుతూ బోధించు,సమీకరించు, పోరాడు అనే మహానినాదంతో భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహానుభావుడు అని కొనియాడారు. గ్రామంలో విస్తరిస్తున్న గంజాయి, డ్రగ్స్, గుడుంబా వంటి చెడు ప్రభావం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ సమస్యపై తక్షణమే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను సరైన మార్గంలో నడిపించే ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామ ఉపసర్పంచ్ కోట ప్రమోద్ మాట్లాడుతూ
ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా సమాన అవకాశాలు కల్పించిన డాక్టర్ అంబేద్కర్ రుణపడి ఉండాలని తెలిపారు. చదువు ద్వారా ప్రశ్నించే తత్వం పెరుగుతుందని, నేటి సమాజంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు,ఎంపీలు వంటి అనేక మంది ప్రజాప్రతినిధులు రిజర్వేషన్ ద్వారానే ఎదిగారని స్పష్టం చేశారు.

దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి మాట్లాడుతూ,
పౌర హక్కుల దినోత్సవ సభలు కేవలం ఎస్సీ ఎస్టీ వాడల్లోనే కాకుండా నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని దళితులపై జరుగుతున్న దాడుల వల్ల నష్టపోయేది సమాజమేనని పేర్కొన్నారు.కుల భేదాలను మర్చిపోయి మేము–మీరు అనే భావనను విడిచిపెట్టి అందరం ఒక్కటిగా ఆలోచిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని, అప్పుడు జిల్లా స్థాయి గుర్తింపు, ప్రభుత్వ నిధులు లభించి గీసుకొండ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ పి. రాజేంద్రప్రసాద్, హెచ్డబ్ల్యూఓ హరిత, గ్రామం వార్డు మెంబర్లు పసుల యుగేందర్, దౌడు చిన్న జ్యోతి, దౌడు ఎలీషా, దౌడు సారిక, మాజీ సొసైటీ డైరెక్టర్ దౌడు సునీల్, మాజీ వార్డ్ మెంబర్ దౌడు రాజేష్ గ్రామ కరోబార్ అలీ
అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రం సందర్శన.
సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. వారి చదువు, ఆరోగ్యం, పోషణపై వివరాలు తెలుసుకున్నారు.అక్కడి పిల్లల సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో విద్య, ఆరోగ్యం, పిల్లల సంక్షేమానికి తమ పాలనలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా రాజ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
