మీ చదువులకు నాదే పూర్తి బాధ్యత కడియం శ్రీహరి

స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటి ధాత్రి

స్టేషన్ ఘనపూర్ మండల కేద్రంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన దేవరాజుల సమ్మయ్య, తాను ఆటో చిన్న పండ్ల దుకాణం నడుపుకుంటూ జీవనోపాధి సాగించేవాడు. అతనికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సమ్మయ్య మరణించగా వారి కూతుళ్ళ చదువులకు, వారి జీవనోపాదికి ఇబ్బంది కావడం తో తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సమ్మయ్య ముగ్గురి కూతుళ్ళ పైచదువులకు వారి జీవనోపాధి కి తనవంతు సహకారం అందిస్తానని మాట ఇచ్చారు.
తక్షణ సహాయంగా స్టేషన్ ఘనపూర్ వాస్తవ్యులు బిఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, 25000 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ జిల్లా నాయకులు రూరల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బెలిదే వెంకన్న, అన్నం బ్రాహరెడ్డి, స్టేషన్ ఘనపూర్ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు పోగుల సారంగపాని, ముదిరాజ్ జనగామ జిల్లా మహాసభ అధ్యక్షులు నీల గట్టయ్య, నమిలిగొండ ఎంపీటీసీ పురమాని రజాక్ యాదవ్, ఎంపీటీసీ ఎడ్ల వెంకటస్వామి,పామునూర్ సర్పంచ్ కోతి రాములు, పెసరు సారయ్య, యాకుబ్ పాషా, కడియం యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఎలమకంటి నాగరాజు, సోమయ్య, కడియం యువసేన స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షుడు జీడి ప్రసాద్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!