ప్రమాద బీమా చెక్కు అందజేత

ప్రమాద బీమా చెక్కు అందజేత

జగిత్యాల జిల్లా నేటిదాత్రి:ప్రతినిధి జిల్లాలోని రాయికల్ మండలమూటపెల్లి గ్రామానికి చెందిన బండి లక్ష్మీరాజం అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రాయికల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ బి ఐ జనరల్ ఇన్సిరెన్స్ ద్వారా మంజూరైన ప్రమాద బీమా కింద రూ. 20 లక్షల చెక్కును తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ బి.గంగాధర్, శాఖ అధికారి వై.నర్సారెడ్డి ప్రాంతీయ బీమా అధికారి చిట్ల సనత్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రమాద భీమా పధకాన్ని వినియోగించుకుని ప్రజలందరు వారి కుటుంబాలకు ఆసరాగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మూటపెల్లి గ్రామ సర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్ రంజిత్, కొత్తపేట గ్రామ సర్పంచ్ రాజేశం, ఒడ్డెర కాలని గ్రామ సర్పంచ్ వెంకమ్మ నర్సయ్య, ఎంపీటీసీ మందుల శ్రీనివాస్, రమేష్, రాజేందర్, నసిర్, తిరుపతి, లక్ష్మీ నర్సయ్య, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *