Headlines

ప్రతి ఒక్కరూ కొవిడ్ వాక్సిన్ విధిగా తీసుకోవాలి.

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.
సుబేదారి (హనుమకొండ జిల్లా) నేటిధాత్రి:
గురువారం హసన్ పర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, హసన్ పర్తి శాసన సభ్యులు ఆరురి రమేష్, కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలసి కొవిడ్ ప్రచార వాహనాలను జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లాకు 12 కోవిడ్ వాహనాలు అందించడం పట్ల సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ వాహనాల ద్వారా కోవిడ్ టీకాలు వేగవంతం చేయడానికి, కరొనా నియంత్రణకై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని అన్నారు.వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెఓ డాక్టర్ మదన్ మోహన్, డిప్యూటీ డిఎంహెఓ డాక్టర్ యాకుబ్ పాష , డాక్టర్లు శ్రీకృష్ణ రావు‌, మల్లి కార్జున్ రావు ,గీతాలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *