పోలీస్ స్టేషన్లో టిప్పర్ లోని ఇసుక మాయం

అధిక లోడు తో వెళ్తున్న ఇసుక టిప్పర్ ను పట్టుకున్న మైనింగ్ అధికారులు.

పట్టుకున్న ఇసుక టిప్పర్ కు పొలీస్ స్టేషన్ కు తరలింపు. 

మైనింగ్ అధికారులు పట్టుకున్న టిప్పర్ లో ఇసుక మాయం చేసిన ఘనులు. 

పొలీస్ స్టేషన్లో పెట్టిన టిప్పర్ లో నుండి ఇసుక ఎలా మాయం అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి..? 

తంగళ్ళపల్లి నేటిధాత్రి.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మానేరు వాగు నుండి అక్రమంగా అధిక లోడుతో వెళుతున్న ఇసుక టిప్పరు ను గురువారం వేకువ జామున మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. మైనింగ్ అధికారులు పట్టుకున్న ఇసుక టిప్పర్ ను స్థానిక మండల పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తరలించిన ఇసుక టిప్పరు అధిక లోడుతో ఇసుకను కలిగి ఉంది. మరసటి రోజు మధ్యాహ్నం ఇసుక టిప్పర్ నుండి సగం ఇసుక మాయం అవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాత్రంతా తిరుగుతూ కష్టపడి మైనింగ్ అధికారులు పట్టుకున్న పనికి పలితం లేకుండా పోయింది. మైనింగ్ అధికారులు పట్టుకోవడం ఇలా ఇసుక మాయం అవడం సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ముందు ఉంచిన ఇసుక టిప్పర్ నుండి ఇసుక మాయావడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న వాహనాలకే భద్రత కరువైందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ పనికి ఎవరైనా సహకరించారు అనే అనుమానాలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *