నియోజకవర్గ ఎమ్ ఎల్ ఏ సోషల్ మీడియా కి పరిమితం. మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు.

40 సంవత్సరాలు పాలించిన అసెంబ్లీలో లిఫ్ట్ ఇరిగేషన్ అడగడం ఏంటిది, పుట్ట మధు చేసిన అభివృద్ధి ని ఓరువలే ఎంఎల్ఏ ఓర్వలేక పోతున్నారు. సర్పంచ్ బాపు.

ప్రజలను ముసుగేసి ఉంచిన ఎంఎల్ఏ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అని నేటికీ ప్రజలకు తెలియని దుస్థితి. సీనియర్ నాయకుడు బాపు.

ఆసుపత్రి సమస్యలపై చైర్మన్ చెప్పాలి కానీ మధ్యవర్తులు సమాధానాలు చెప్పడం విచిత్రం. ఆన్కారి ప్రకాష్.

జడ్పీ చైర్మన్ ఆసుపత్రిలో సమస్యలను బహిర్గతం చేస్తే కాంగ్రెస్ అనుచిత వాక్యాలు చేయడం అవగాహన లోపం. లక్ష్మణ్.

మహాదేవపూర్-నేటి ధాత్రి:

 

నియోజకవర్గ ఎంఎల్ఏ శ్రీధర్ బాబు జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని ప్రతిపాదనతో వచ్చిన డయాలసిస్ కేంద్రానికి నియోజకవర్గ ఎంఎల్ఏ నేను తెచ్చినానని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసుకుంటున్నారని 40 సంవత్సరాలు పాలించిన కుటుంబం చివరికి అసెంబ్లీలో కాలువలు లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి అడగడం విచిత్రంగా ఉందని నాటి నుండి నేటి వరకు నియోజకవర్గ ప్రజలకు ఎంఎల్ఏ ప్రజలకు ముసుగులో ఉంచారని ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఎంఎల్ఏ అన్న విషయం ప్రజానీకానికి తెలవదని చైర్మన్ చెప్పాల్సిన సమాధానాలు మధ్యవర్తులతో చెప్పించడం విచిత్రవని సమస్యలను బహిర్గతం చేస్తే క్యాబినెట్ హోదా ఉన్న చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అవగాహన లోపం అని బంతిని నియోజకవర్గ మహిళా ఇన్చార్జి కేదారి గీతాబాయి, మహదేవ్పూర్ సర్పంచ్ శ్రీపతి బాబు బీసీ సెల్ మండల అధ్యక్షుడు కారంగుల బాపూరావు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆన్కారి ప్రకాష్ మెరుగు లక్ష్మణులు ఆదివారం రోజున స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో అన్నారు.

 

 

 *నియోజకవర్గ ఎమ్ ఎల్ ఏ సోషల్ మీడియా కి పరిమితం. మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు.* 

 

పత్రికా సమావేశంలో మంథని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఇంచార్జ్ కేదారి గీతాబాయి మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఉన్న ఎంఎల్ఏ శ్రీధర్ బాబు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధుకర్ జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీహర్షిని తీసుకువచ్చిన పథకాలను సామాజిక మద్యంలో ఎంఎల్ఏ తనే తీసుకురావడం జరిగిందని చెప్పుకోవడానికి మాత్రమే పరిమిత వయ్యారని అన్నారు. జక్కు శ్రీ హర్షిని పుట్ట మధు కృషితో ఏర్పాటైన డైలాగ్స్ సెంటర్లు ఎమ్మెల్యే తీసుకురావడం జరిగిందని చెప్పుకుంటున్నప్పటికీ కనీసం నేటి వరకు వాటికి సంబంధించి భవన నిర్మాణం ఇతర ఇక్యూట్మెంట్లకు ఏనాడైనా ఎమ్మెల్యే ఆసుపత్రి కి సందర్శించిన దాఖలాలు ఉన్నాయని ప్రశ్నించారు. జక్కు శ్రీహర్షిని కోరిక మేరకు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా కేంద్రంలో పర్యటించిన క్రమంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు వేదికపైనే అప్రూవల్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే మర్చిపోయారని గీతా బాయ్ అన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు ప్రజలపై ప్రేమ మమకారం ఉంటే డయాలసిస్ సెంటర్ తక్షణ ఏర్పాటుకు నేటి వరకు ఎందుకు స్పందించలేదు ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. బ్యాలెన్స్ కేంద్రం త్వరగా పూర్తి చేయాలని పట్టుదల కేవలం జక్కు శ్రీ హర్షిని మరియు పుట్ట మధుకర్లకే ఉందని గత నాలుగు రోజుల క్రితమే జిల్లా కలెక్టర్లు సైతం డయాలసిస్ సెంటర్ ఏర్పాటుపై సమీక్ష చేయడం జరిగిందని వరుసటిరోజే జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని ఆసుపత్రికి సందర్శించడం కూడా జరిగిందని సందర్శనకు వచ్చిన క్రమంలో ఆసుపత్రిలో అనేక మౌలిక వసతులకు గూగుల్, నోచుకోకుండా ఉండడం తమ నాయకుడు పుట్ట మధు కట్టించిన మరుగుదొడ్లే ఉన్నాయని వాటిని కూడా నిరుపయోగంగా ఉండడంతో వయసు పైబడిన పేద రోగులకు ఎనలేని ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని నియోజకవర్గ ఎమ్మెల్యే ఆసుపత్రి అభివృద్ధిపై మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాల్సి ఉండగా ఒక్కసారి కూడా చైర్మన్ గా ఉండి ఆసుపత్రి అభివృద్ధిపై సమావేశం పెట్టకపోవడం సూచనీయమని ఓట్లేసి గెలిపించిన ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉంటే ఎంఎల్ఏ శ్రీధర్ బాబు తక్షణమే ఆస్పత్రిలో అధికారులతో మీటింగ్ నిర్వహించి మౌలిక వసతుల కల్పన ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని గీతాబాయి డిమాండ్ చేశారు.

 

 

 *40 సంవత్సరాలు పాలించిన అసెంబ్లీలో లిఫ్ట్ ఇరిగేషన్ అడగడం ఏంటిది, పుట్ట మధు చేసిన అభివృద్ధి ని ఓరువలే ఎంఎల్ఏ ఓర్వలేక పోతున్నారు. సర్పంచ్ బాపు.* 

 

పుట్ట మధు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఊర్వలేక కాంగ్రెస్ పార్టీ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారని మహదేపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు అన్నారు. 40 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని పాలించిన దుదిల్ల శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా దామరకుంట లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారం లిఫ్ట్ ఇరిగేషన్ పంకిన లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం అని కూడా అసెంబ్లీలో లేవడెత్తడం జరిగింది ఇలాంటి పథకాలు ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కొత్తగా ఏమీ కాదని కేవలం శిలాఫలకానికే పరిమితం చేసి వదిలిపెట్టడం ఆనవాయితీగా వస్తుందని శ్రీపతి బాబు అన్నారు. శ్రీ పదరావ్ నుండి శ్రీధర్ బాబు వరకు ఈ ప్రాంతంలో ఒక్క ఎకరానికి నీరు అందించిన దాఖలాలు లేవని 40 సంవత్సరాల క్రింద పంకిన వాగులో మోటర్లు అమర్చి వదిలిపెట్టడం జరిగిందని కుంట్లం రాగి చెట్టు వద్ద ఇప్పటికీ ఒక మోటర్ ఉందని ఇలా కేవలం శిలాఫలకాలు కాలయాపన చేసి మాత్రమే కాలం గట్టెక్కిస్తున్నారని తెలిపారు. చిన్న కాలేశ్వరం కావాలని పలుమార్లు చెప్పడం జరుగుతుందని కానీ చిన్న కాలేశ్వరం నుండి మొదలుకొని కొన్ని కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనుండి పైపులు అమర్చడం జరిగిందని ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ పనులు సాధించకపోవడంతో పైప్లైన్ వేసిన కంపెనీ తిరిగి పైప్ లైన్ ను తీసుకు వెళ్లడం జరిగిందని 2014లో పుట్ట మధు ఎం ఎల్ ఏ గా గెలుపొందిన అనంతరం కన్నేపల్లి చిన్న కాలేశ్వరం నుండి కాటారం వరకు ఫారెస్ట్  క్లియరెన్స్ ను తీసుకువచ్చి పనులు చేపట్టడం జరిగిందని ప్రస్తుతం కేవలం ప్రారంభ దశకు వచ్చి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ బాబు పనులు ప్రారంభించే సత్తా లేక తిరిగి అసెంబ్లీలో లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అలాగే డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సౌకర్యాన్ని పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా అందించి చెప్పడం విద్యార్థులతో చర్చించడం తప్పు కాదు కదా జూనియర్ కళాశాల లో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించవచ్చు కదా అని దానికి మీరు భోజనం పెడితే తమకేమీ అభ్యంతరం లేదని విద్యార్థులకు సదుపాయాలు సొంతగా కలిగిస్తే రాజకీయాలు చేయడం మానేయాలని శ్రీపతి బాబు అన్నారు.

 

 *ప్రజలను ముసుగేసి ఉంచిన ఎంఎల్ఏ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అని నేటికీ ప్రజలకు తెలియని దుస్థితి. సీనియర్ నాయకుడు బాపు* .

 

నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన శ్రీధర్ బాబు నియోజకవర్గ ప్రజలకు కేవలం ఏదో చేస్తానని అభివృద్ధి పేరుతో ముసుగు వేసి ఉన్నాడే తప్ప ఏమీ చేయలేదని బీసీ సెల్ మండల అధ్యక్షుడు కార్మికుల బాపూరావు అన్నారు. అలాగే నియోజకవర్గానికి శాశ్వతంగా నేనే పాలిస్తానని ఊహలు శ్రీధర్ బాబు ఉన్నారని తెలుపుతూ ఎమ్మెల్యే హోదాలో ఉన్న శ్రీధర్ బాబు ప్రభుత్వం నుండి నియోజకవర్గానికి ఎన్ని నిధులు వస్తున్నాయి వాటికి సంబంధించి అభివృద్ధి పనులు ఎలా కొనసాగుతున్నాయి పనుల స్థితిగతులు ఎక్కడ వరకు చేపట్టడం జరిగింది అనే అవగాహన ఉందా అని ప్రశ్నిస్తూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చైర్మన్గా ఎమ్మెల్యే ఉన్నారని అధిక జనాభా ఈ విషయం తెలవదని ఎద్దేవా చేశారు. ఆసుపత్రికి దయచేసి సెంటర్ సాంక్షన్ అయ్యి ఏడు నెలలు గడుస్తున్న అనేకమంది కిడ్నీ వ్యాధిన వారి పడి పట్టణాలకు డయాలసిస్ కొరకు వెళుతున్నారని తాను విద్యావంతుడు గా ఉన్న ఎమ్మెల్యే అని చెప్పుకోవడమే ఏమి చేశారని ఎందుకు డయాలసిస్ సెంటర్ ను ఇప్పటికీ పూర్తి చేయలేకపోయాడు అన్న విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని బాపూరావు డిమాండ్ చేశారు. ప్రజలు ప్రశ్నిస్తే ప్రభుత్వం లేదని అనడమే శ్రీధర్ బాబుకు సులువని పదవి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి శ్రీధర్ బాబు చేసింది ఏమిటని నేను సూటిగా ప్రశ్నిస్తున్నానని బాబురావు బహిరంగ సభకు సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక శాసనసభ్యులు తమ ప్రాంతాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లారని అనేక వసతులను కల్పించి నేడు ఆ నియోజకవర్గాలు కళకళలాడే రా చేశారని కానీ శ్రీధర్ బాబు మాత్రం ప్రభుత్వంలో ఉన్న నియోజకవర్గానికి ఏమీ చేయలేదని కార్మికుల బాపూరావు అన్నారు.

 

 

 *ఆసుపత్రి సమస్యలపై చైర్మన్ చెప్పాలి కానీ మధ్యవర్తులు సమాధానాలు చెప్పడం విచిత్రం. ఆన్కారి ప్రకాష్.* 

 

జిల్లా జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులు మౌనిక వసతులు లేకపోవడంతో చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబును ప్రశ్నించడం జరిగిందని జడ్పీ చైర్మన్ అడిగిన ప్రశ్నకు చైర్మన్ సమాధానాలు చెప్పాలి కానీ మధ్యవర్తులు లేనిపోని మాటలు చెప్పి ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం చేయకూడదని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అన్కారీ ప్రకాష్ అన్నారు. జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని సందర్శన క్రమంలో అనేక మంది రోగులు ఆసుపత్రిలో ఇబ్బందులకు గురవుతున్న సమస్యలను జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగిందని మంచినీరు మరుగుదొడ్లు రక్త పరీక్షల కు సంబంధించి ఇబ్బందులు అలాగే స్త్రీలకు ప్రత్యేక వైద్య నిపుణురాలు లేకపోవడం సమయానికి డాక్టర్లు రాకపోవడం లాంటి అనేక సమస్యలను జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహరిషరి దృష్టికి తీసుకురావడం జరిగిందని ప్రత్యేకంగా దినసరి కూలీతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కూడా నాలుగు నెలలుగా తమ జీతాలు రావడంలేదని చెప్పుకోవడం జరిగిందని ఆసుపత్రి ప్రస్తుత దినస్థితిను దృష్టిలో పెట్టుకొని జడ్పీ చైర్మన్ ఆసుపత్రి అభివృద్ధి చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎందుకు సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కరించడం లేదని ప్రస్తుతం జరిగిందని ప్రకాష్ అన్నారు. కానీ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే సమాధానం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకులు లేనిపోని సమాధానాలు చెప్పడం సరైన పద్ధతి కాదని చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేకు ఆసుపత్రి నువ్వు మౌలిక వసతుల కల్పన ఆసుపత్రి అభివృద్ధిపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసే బాధ్యత ఎమ్మెల్యేకు ఉందా లేదా అని ప్రశ్నించారు జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని కేవలం ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారని ఆసుపత్రి అభివృద్ధి వారి బాధ్యత అని మాత్రమే ప్రశ్నించడం జరిగిందని దానికి ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వాస్తవాలు బయటికి పడడంతో కళాశాలలో భోజనం పెట్టడం లాంటి కార్యక్రమాల వైపు వాస్తవాలను కప్పి పుచ్చడం కొరకు చేసే ప్రయత్నాలు మానుకోవాలని ప్రజలందరూ గమనిస్తున్నారని మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే టిఆర్ఎస్ పార్టీ ఊరుకోలేదు లేదని ఈ సందర్భంగా ప్రకాష్ హెచ్చరించారు.

 

 

 *జడ్పీ చైర్మన్ ఆసుపత్రిలో సమస్యలను బహిర్గతం చేస్తే కాంగ్రెస్ అనుచిత వాక్యాలు చేయడం అవగాహన లోపం. లక్ష్మణ్.* 

 

కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు క్యాబినెట్ హోదా కలిగిన జిల్లా పరిషత్ చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారికి అవగాహన లోపం స్పష్టంగా కనబడుతుందని టిఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు మెరుగు లక్ష్మణ్ అన్నారు. జడ్పీ చైర్మన్ సామాజిక ఆసుపత్రికి సందర్శించి అక్కడ ఉన్న లోటుపాటులను రోగులు పడుతున్న ఇబ్బందులను ప్రజల ముందుకు తీసుకురావడం జరిగిందే తప్ప మరి మీ కాదని రాష్ట్ర ప్రభుత్వం రోగులకు అందించే వసతుల పరిస్థితులు కూడా అడిగి తెలుసుకోవడం జరిగిందని కానీ 2018 నుండి ఆసుపత్రి రోగులకు సంబంధించి అనేక ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని రోగులు పలు ప్రజలు కూడా చెప్పడం జరిగిందని లక్ష్మణ్ అన్నారు. కేవలం జడ్పీ చైర్మన్ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించుటకు మాత్రమే సామాజిక ఆసుపత్రి అభివృద్ధి చైర్మన్ ఎమ్మెల్యే ఉండడంతో వారిని ప్రశ్నించడమే తప్ప వారిపై కక్ష ద్వేషంతో చెప్పలేదని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గమనించాలని లక్ష్మణ్ కోరారు. వాస్తవ పరిస్థితులను గాలికి వదిలేసి స్థానిక నాయకులు వార్డ్ మెంబర్ కు కూడా గెలవైనటువంటి వారు క్యాబినెట్ స్థాయి ప్రజా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారు కూడా పెద్దవారు అవుతారని ఊహలో ఉండి చెప్పడం సరైన పద్ధతి కాదని అన్నారు. జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే పై ప్రశ్నిస్తే దానికి సమాధానం ఎమ్మెల్యే ఇవ్వాలని కేవలం నియోజకవర్గంలో కుల అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే అది ఎంఎల్ఏ శ్రీధర్ బాబు అని కేవలం ఒక దళిత జడ్పీ చైర్మన్ శ్రీధర్ బాబు కు ప్రశ్నించడం ఏంటిదది ఒక కుల అహంకారంతోనే కిందిస్థాయి వారి నుండి అనిత వాక్యాలు చేయించడం జరుగుతుందని మెరుగు లక్ష్మణ్ అన్నారు. ఈ పత్రిక సమావేశంలో ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీపతి బాపు, మంథని మహిళ ఇంచార్జి కేదారి గీత, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పెండ్యాల మమత, ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, మండల యూత్ అధ్యక్షుడు యండి అలీమ్ ఖాన్,   జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్,మండల ఉపాధ్యక్షుడు లింగాల రామయ్య,బిసి సెల్ మండల అధ్యక్షుడు బాపు రావు మండల నాయకులు అంకారి ప్రకాష్,మెరుగు లక్ష్మణ్, శేఖర్, టౌన్ యూత్ అధ్యక్షుడు రాజశేఖర్, సతీష్, టిల్లు, ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *