గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పై లాఠీచార్జి జరగలేదు

పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత

భీమదేవరపల్లి నేటిదాత్రి

గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పై లాఠీచార్జి జరిగిందని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత వెంటనే స్పందించి, ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడం వల్ల పోలీసులకు నిర్వాసితులకు మధ్య తోపులాట మాత్రమే జరిగింది, ఎలాంటి లాఠీచార్జ్ జరగలేదని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. భూ నిర్వాసితులు సమన్వయం పాటించాలని సూచించారు. పై అధికారులతో మాట్లాడి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *