గణేష్ నిమజ్జనానికి కోవిడ్ నిబంధనలు పాటించాలి

జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ములుగు ప్రతినిధి:నేటిధాత్రి:
గణేశ నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం రోజున వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దిశ నిర్దేశం మేరకు వినాయక నిమజ్జనాన్ని విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గారు ఒక ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు. ఈ యొక్క నిమజ్జనానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ఈ యొక్క నిమజ్జనాన్ని జరుపుకోవాలసిందిగా కలెక్టర్ అన్నారు.
జిల్లా రెవెన్యూ మరియు పోలీసు యంత్రాంగానికి సంబంధిత గణేష్ మండళ్ల అసోసియేషన్ మెంబెర్స్, ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *