–పలు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు
పట్టించుకోని ఆయా గ్రామల అధికారులు
ఖానాపురం నేటిధాత్రి
ఖానాపురం మండలంలోని పలు గ్రామాలలో కోతుల బెడదను విజృంభిస్తున్నాయి. మండలంలోని పలు గ్రామాలలో కోతులు ఇంట్లో చొరబడి బియ్యం పారబోయడం అన్నం తినడం కోడి గుడ్లు తినడం ఇలా ఇల్లంతా చిందరవందరగా చేస్తున్నాయి. గత రెండు నెలలో క్రితం బడికి వెళుతుంటే ఇద్దరు విద్యార్థులను కరవడం కూడా జరిగింది అని, కోతుల బెడదను పట్టించుకునేదెవరు ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామ ప్రజలు ఇంబ్బందులు పడుతుంటే చూస్తువుంటారా అని అన్నారు. అలాగే ఆయా గ్రామాల కార్యదర్శిలు .ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నారు,రాత్రి వేళల్లో కూడా కోతులన్నీ ఇండ్లలోనే చెట్ల మీద నిద్రిస్తూ అరుస్తూ గోల గోల చేస్తున్నాయి.రాత్రిలు,పగలు ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆయా గ్రామాలకు సంబంధించిన గ్రామ కార్యదర్శిలు పట్టించుకుని, ఈ కోతుల బెడద నుండి గ్రామ ప్రజలను కాపాడాలని పలు గ్రామాల ప్రజలు కోరారు.