అన్నిధానాల్లో అన్నదానం గొప్పది

వరంగల్ సిటి నేటిధాత్రి

అన్నిదానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.నన్నపునేని నరేందర్ అభిమాన సంఘం వ్యవస్థాపకులు బత్తుల కుమార్ ఆద్వర్యం 23వ డివిజన్ ఎస్.ఆర్.ఆర్ తోట లో లాక్ డౌన్ నేపద్యంలో 500 మంది పేదలకు మాంసాహారంతో కూడిన బోజనం పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై మాట్లాడారు లాక్ డౌన్ సమయంలో పేదలకు సేవ చేయడం అభినందనీయమని అన్నారు. పేదవారు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పలు సేవలు అందిస్తున్నారని వారి మార్గనిర్దేశనంలో దాతలు ముందుకొచ్చి సేవ చేయడం అభినందనీయమని నిర్వహుకులను కొనియాడారు ఈ కార్యక్రమంలో రామ రమేష్,అందుగుల శ్రీనివాస్,కార్పోరేటర్ కత్తెరశాల వేణు గోపాల్,మాజీ కార్పోరేటర్ పల్లం రవి,వడ్నాల నరేందర్,కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్,కవిత,ఆశ,వగిలిశెట్టి అనీల్,బొల్లం రాజు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *