బోయినిపల్లి:నేటిధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం గుండన్న పల్లి శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేసినట్లు తెలిపారు. వేములవాడ నుండి గుండనపల్లి వైపు అక్రమ ఇసుక తరలిస్తుండగా గుండన్నపల్లి గ్రామ సమీపం లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక ను తరలిస్తుండగా అనుమానం వచ్చి ట్రాక్టర్ ను అపగా డ్రైవర్ పరారు కావడంతో ఇసుక ట్రాక్టర్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ ఐ అభిలాష్ తెలిపారు.