అక్రమ రేషన్ బియ్యం సరఫరాలో వెలుగులోకి మరో డాన్.

పెద్ద మొత్తంలో పక్కా రాష్ట్రానిది తరలించేందుకు సిద్ధంగా రేషన్ బియ్యం.
పక్కా సమాచారంతో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న తహసిల్దార్ సివిల్ సప్లై అధికారులకు సమాచారం.
ఇంటి యజమాని తో పాటు మరో వ్యక్తి పై కేసు నమోదు .

మహాదేవపూర్  నేటిధాత్రి:

కొన్ని దశాబ్దాల క్రితం మహదేవ్పూర్ నుండి పక్క రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని గ్రామాల్లో ముఠాలుగా మారి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి తరలించి లక్షల రూపాయలను సొమ్ము చేసుకునే వారు గత కొన్ని సంవత్సరాల క్రితం రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి రేషన్ బియ్యం సరఫరా తో పాటు వాహనదారులను కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తూ కఠిన నిబంధనలు చేపట్టడంతో నాలుగు ఐదు సంవత్సరాల నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణా సద్దుమణిగి ఉన్నప్పటికీ మరోసారి అక్రమ రేషన్ బియ్యం రవాణా కు సూరారం గ్రామం నుండి పునాదులు వేస్తూ రేషన్ బియ్యం రవాణా కు సంబంధించిన మరో డాన్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో నీ సూరారం గ్రామానికి చెందిన సూరం మహేష్ అదే వ్యక్తి కి సంబంధించిన ఇంట్లో పెద్ద మొత్తంలో పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అంత రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధంగా ఉండటం తో స్థానికులు శుక్రవారం అర్ధరాత్రి తహసిల్దార్ శ్రీనివాస్ కు సమాచారం ఇవ్వడంతో మహేష్ పాత ఇంటిలో సోదాలు జరిపి ఇంటికి తాళం వేసి ఉండటంతో గ్రామస్తుల సమక్షంలో తాళం పగులగొట్టి చూడగానే పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం సంచులలో అలాగే నేలపై రేషన్ బియ్యం ఉండడంతో తహసిల్దార్ శ్రీనివాస్ స్థానిక రేషన్ డీలర్ కు పర్యవేక్షణ నిమిత్తం సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించే వరకు తమ ఆధీనంలో తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. తహసిల్దార్ సమాచారం మేరకు శనివారం రోజున సివిల్ సప్లై డి టి ముస్తఫా సూరారం గ్రామానికి చేరుకొని అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉన్న సూరం మహేష్ పాత ఇంటితోపాటు మహేష్ నివసిస్తున్న ఇంటిని సైతం తనిఖీ చేయడం జరిగింది సూర్య మహేష్ పాత ఇంట్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం అదే గ్రామానికి చెందిన గంగారపు రమేష్ అనే వ్యక్తి కిరాయికి ఉంటూ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి తరలించడం జరుగుతుందని అక్రమ రవాణా కొరకు కొనుగోలు చేసిన రేషన్ బియ్యం ముప్పై ఏడు కింటల్ నరేష్ అన్న బియ్యం స్వాధీనం చేసుకో బడిందని 76 బస్తాలలో రేషన్ బియ్యాన్ని నిలువ చేయడం జరిగిందని అక్రమ రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వ్యక్తి గంగారపు రమేష్ తో పాటు ఇంటి యజమాని సూరం మహేష్ లపై 6ఏ కేసులు నమోదు చేసి బియ్యాన్ని స్థానిక డీలర్ కు అందజేసినట్లు సివిల్ సప్లై అధికారి ముస్తఫా తెలిపారు.
పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కు డాన్ ఎవరు:-
దశాబ్దాల తరబడి అక్రమ రేషన్ బియ్యం సరఫరా ఆగిపోయిందని అనుకుంటున్న సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో అంత రాష్ట్రానికి రేషన్ బియ్యాన్ని సరఫరా చేసేందుకు సూరారం లో సిద్ధంగా ఉన్న ఆ రేషన్ బియ్యం కొనుగోలు అక్రమ రవాణా చేయడంలో ఎవరి పాత్ర ఉంది ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయడం గంగారపు రమేష్ కు సాధ్యమవుతుందా గంగారపు రమేష్ వెనుక మరో పెద్ద తలకాయ ఏదైనా ఉందా మళ్లీ అక్రమ రేషన్ బియ్యం రవాణా సూరారం గ్రామం నుండే పురుడు పోసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఒకేసారి తెలుగులోకి పెద్దమొత్తంలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి రెవెన్యూ మరియు పోలీసు శాఖ నిఘా భోజనం చేసి అంబటిపల్లి అంతరాష్ట్ర వంతెన నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *