మహాత్ముడికి నివాళి అర్పించిన ఎంపీ వద్దిరాజు

ఖమ్మం, అక్టోబర్, 2:

గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని గాంధీ చౌక్ లోని

జాతిపిత విగ్రహానికి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పూలమాల వేసి నివాళులర్పించారు. అహింసా

మార్గంలో ఆయన గొప్ప పోరాటాలు నడిపించి దేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించి పెట్టిన సందర్భాలను ఎంపీ గుర్తు చేశారు.ఆ మహాత్ముడి సేవలు,త్యాగాలను సూర్యచంద్రులు ఉన్నంత కాలం మానవజాతి మర్చిపోదన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు ఇనుగుర్తి వెంకటేశ్వర్లు,శ్రీధర్, స్వర్ణకారుల సంఘం నాయకులు పరబ్రహ్మం, చిదంబరచారి, దుర్గాప్రసాద్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *