పెన్షన్ ఇప్పించండి సార్.ఏళ్లు గడిచినా పింఛన్ రావడం లేదు.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

 

నా భర్త చనిపోయి సంవత్సరం గడుస్తున్నా నాకు గర్జన పింఛన్ రావడం లేదని రామాయంపేట మండలం దామరచేర్వు గ్రామానికి చెందిన సౌడ శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. 

దామరచెరువు గ్రామానికి చెందిన సౌడ శ్యామల భర్త గత సంవత్సరం మృతి చెందాడు. ఈ విషయాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శికి వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంతవరకు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒక కుమారుడు.కూతురు ఇద్దరు పిల్లల ను కూలిపని చేసుకుంటూ ఇద్దరు పిల్లలలను పోషించుకుంటు కాలం వెళ్లదీస్తూ ఉంది.

తనకు ఇతర ఆదాయ మార్గాలు లేవని పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు చేయలేకపోవడం చాలా బాధాకరమన్నారు. పైసా ఆదయాం కూడా లేదు అధికారులైన ఇప్పటికి స్పందించి పెన్షన్ మంజూరు చేయాలని బాధితురాలు శ్యామల కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *