నార్సింగ్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు మురికి నీరు ప్రవాహం.

పలుమార్లు చెప్పినా పట్టించుకోని సర్పంచ్, ఈ ఓ.

 

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

 

మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం లోకి వెళ్లకుండా మురికి నీళ్లు ప్రవహిస్తుండడంతో ప్రజలు ఎంతో భక్తితో శుభ్రంగా గుడికి వెళ్తుంటే ఆ యొక్క మురికి నీ రు ని తగులుతూ గుడి లోపలికి వెళ్లాల్సి వస్తుందని ఇలాంటి దుస్థితి ఏ గ్రామంలో ఉండదని ప్రజలు అంటున్నారు. 

ఈ యొక్క మురికి నీరు పదో వార్డులోని ఎరుకల బస్తి వాసుల డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక దేవాలయం ముందు మురికివాడ లాగా తయారయింద నీ ఈ విషయమై ఆ బస్తీ వారిని అడగగా వారు పలుమార్లు గ్రామ సభలో సర్పంచ్ కి ,ఈవో గారికి వార్డు మెంబర్ కి మరియు జడ్పిటిసి బాణాపురం కృష్ణారెడ్డికి ,ఎంపీపీ చిందం సబితాకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని చివరకి విసుగు చెంది కలెక్టర్ కు సర్పంచ్ పైన ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. 

దాని విషయమై అతనిని పిలిచి సర్పంచ్ నా పైన కంప్లైంట్ ఇస్తావ అని అతనిని బెదిరించడం జరిగింది.

దయచేసి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి పలు అంటు వ్యాధులు వ్యాపిస్తాయి కాబట్టి మా యొక్క వార్డులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని వెంటనే డ్రైనేజీ వ్యవస్థను సమకూర్చాలని మా యొక్క మనవి అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *