కోనుగోలు చేసిన దాన్యాన్ని 24 గంటలలో తరలించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల: 

వ్యవసాయ మార్కేట్ సెంటర్ల ద్వారా కోనుగోలు చేసిన దాన్యాన్ని 24 గంటల లోగా తరలించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ, మార్కేటింగ్, డిఆర్డిఓ, డిసిఓ లతో పాటు రైస్ మిల్లు యజమానులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ లతో సమీక్షించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు చేసిన తరువాత దాన్యం 24 గంటల లోగా ఐకేపి, ఫ్యాక్స్ లేదా వ్యవసాయ మార్కేట్ ద్వారా కేంద్రం నిర్వహకులు బాద్యత వహించాలని, కొనుగోలు చేసిన దాన్యం రవాణాదారులు అలస్యం కాకుండా త్వరగా పూర్తయ్యేలా చూడాలని పేర్కోన్నారు. ప్రతిరోజు 7 నుండి 8 వేల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని, పండుగలు, సెలవుల రోజులలో 6 వేల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగుతుందని, దాన్యం కొనుగోలు త్వరగా జరిగేలా చూడాలని, వాతవరణంలో మార్పులు, వర్షాల వలన దాన్యం తడవకుండా చూడడంలో రైతులతో పాటు కేంద్రం నిర్వహకులు మరియు అధికారులు బాద్యత వహించవలసి ఉందని, ఎఫ్ఎక్యూ నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, ఎఫ్ఎక్యూ ప్రమాణాలు లేకుండా దాన్యాన్ని కొనుగోలు చేసే చోట సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

దాన్యం ప్రమాణాలను అధికారులు దృవీకరించిన అనంతరం కేంద్రం నిర్వహకులు బాద్యత వహించాలని, ప్రమాణాలకు సరిపోయో దాన్యం వెరే దాన్యంతో కలవకుండా వేరుగా ఉండేలా చూడలాని, ట్యాబ్ ఎంట్రి త్వరగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ఇప్పటి వరకు 63వేల మేట్రిక్ టన్నులను కొనుగోలు చేయగా, అందులో 53 వేల మెట్రిక్ టన్నులు దాన్యాన్ని మాత్రమే తరలించడం జరిగిందని, మరో 10 వేల మెట్రిక్ టన్నుల దాన్యం కేంద్రాల వద్దే ఉందని అధికారులు తెలిపారు. ప్రతి కేంద్రాన్ని అధికారులు ప్రతిరోజు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. లారీ డ్రైవర్లు ఎక్కడాకూడా డబ్బులు ఆడగకుండా చూడాలని, సకాలంలో లోడింగ్ అన్ లోడింగ్ అయ్యేలా చూడాలని పేర్కోన్నారు.
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ మాట్లాడుతూ, ఈ సీజన్ లో 407 కేంద్రాలకు గాను 406 ప్రారంభించుకోవడం జరిగింది, ఫ్యాక్స్ లో మరొకటి ప్రారంభించు కోవాల్సి ఉంది. సీజన్ లో 63 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. 10 వేలు కొనులు కేంద్రాల వద్ద ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.

ఈ సమావేశంలో కోరుట్ల ఆర్డిఓ టి. వినోద్ కుమార్, డిఆర్డిఓ పిడి ఎస్. వినోద్, డిఎం సివిల్ సప్లై అధికారి రజినికాంత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి. సురేష్, డిసిఓ రామానుజాచారి, రైస్ మిల్లు యజమానులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *