కాంగ్రెస్‌ ఓటు బిజేపివైపు మళ్లిందా? ప్రచారం చేసిన నేతలు పైకి చెప్పదేంమిటి?

నా చేతికి కత్తి అందించండహోనేనేం చేస్తానో….చూడండహోనేనెంత ఎగిరెగిరి దుంకుతానో చూడండహోఅన్న రేవంత్‌ రెడ్డి ఏం చేశారు. కోవర్జులు వుండే వెళ్లిపోవచ్చుఅని పదే పదే చెప్పి రేవంత్‌ చేసిందేమిటి? మరో ఉత్తర కుమారుడికంటే గొప్పగా చేసిందేమిటి? నేను కొట్టినట్లు చేస్తా! నువ్వు ఏడ్చినట్లు చేయి!! నేను తిట్టినట్లు చేస్తాతుప్పిళ్లను తూద్చేయిఅనుకున్నా బాగుండేదేమో! అంతకన్నా అధ్వాన్నంగా కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు వ్యవహరించింది?ఈటెలకు మేలుఎవరికి లాభం;

పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టి, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ సొంత లాభం చూసుకోవచ్చునా! అని కాంగ్రెస్‌ నేతలే కడిగిపారేస్తున్నారు. ఆ పాటి పోటీ ఎందుకు? దానికి అంత ప్రచారం ఎందుకు? ఎవరిని మోసం చేయడానికి అని కాంగ్రెస్‌ సీనియర్లు రగిలిపోతున్నారు. వచ్చీ రాగానే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ కు, పిసిసి అధ్యక్షుడు చేయాల్సిన పనేనా అని కారాలు మిదియాలు నూరుతున్నారు. అసలు గత ఎన్నికలలో పార్టీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్న స్థితి ఏమిటి? గత ఎన్నికలలో ఈటెల రాజేందర్‌కు చక్కలు చూపించిన కాంగైస్‌ తనకు తానుగా చుక్కలు చూడాలనుకోవడం అంటే ఆత్మహత్య అదృశ్యం కాదా! అదే కౌషిక్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో వుంటే, బిజేపికి అంత సీనుండేదా! రేవంత్‌ రాకతోనే కౌషిక్‌ ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది. అలా అపనమ్మకాన్ని కలిగేలా చేసింది ఎవరో పార్టీలో అందరికీ తెలిసిన ముచ్చటే కదా? అలా పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెట్టి, పార్టీకి పుట్టగతులు లేకుండా చేయడం వెనుక వున్నదేమిటో అందరికీ తెలుసు. ఇలా పార్టీని ఫణంగా పెట్టడం ఎప్పుడూ జరగలేదు. ఈటెల రాజేందర్‌ బిజేపి నాయకుడు. ఉప ఎన్నికలో బిజేపి అభ్యర్థి. యుద్ధం అన్నాక పోరాడాలి. లేకుంటే ముందే తప్పుకోవాలి. కానీ యుద్ధం మధ్యలో చేతులెత్తేయడం రాజకీయ వైకల్యంవైఫల్యంతాను యుద్ధం చేయగలను అనుకున్నప్పుడు, కదనరంగంలోకి దిగినప్పుడు చావో,రేవో తేల్చుకోవాలి. అది మానిలోపాయి కారి ఒప్పందాలు సరైనవేనా! ఉమ్మడి శత్రువును బలంగా కొట్టాలనుకున్నప్పుడు కలిసి కొట్టాలి. కానీ దొంగ దెబ్బ తీసి శత్రవును గెలిచామనుకోవడం విజయం కాదు.

కొన్ని సార్లు పైకి కనిపించని రాజకీయం కౌకు దెబ్బలా పడుతుందంటారు. అది కోలుకోలేని రాజకీయాలకు మూలం కావొచ్చు. ఇంతకీ హుజూరాబాద్‌ లో కాంగ్రెస్‌ పార్టీ పోషించనున్న పాత్రేమిటి? పోషిస్తున్నదేమిటి? చేతులెత్తేసినంత పని ఎందుకు చేస్తోంది. ఎన్నికల బరిలో నిలిచినట్లేనిలిచి? జాతీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ. నూటా నలభై సంవత్సరాల వయసున్న చరిత్ర కలిగిన పార్టీ. ఎన్ని సార్లు చీలికలు పీలికలైనా మళ్ళీ నిలబడిన పార్టీ. ఇంతటి దురవస్థను ఏనాడూ ఎదుర్శొని పార్టీసాక్ష్యాత్తు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలైన ఇందిరా గాంధీ ని సైతం పార్టీ నుంచి బహిష్కరించిన పార్టీ. అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్‌ అది. దేశంలో మళ్ళీ గ్గ పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్న పార్టీ. మరి తెలంగాణ లో ఉనికి కోసం ఆరాట పడుతున్న పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ ఇచ్చి చెల్లాచెదురైన కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ర మళ్ళీ జవసత్వాలు వస్తాయని అందరూ అనుకుంటున్న పార్టీ. మరేమైంది. మొన్నటి దాకా కోవర్టు రాజకీయ ఆరోపణలు విపరీతంగా వున్నదేపార్టీ ప్రెసిడెంట్‌ మారితే తప్ప, పార్టీ తలరాత మారదన్న వాళ్తేఎట్టకేలకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కుర్చీ దిగిపోయాడు.. రేవంత్‌ రెడ్డి కుర్చీ ఎక్కాడు. కొంత జోష్‌ నింపాడు. గాంధీ భవన్‌ కు కళ తెచ్చాడు. దళిత గిరిజన దండోరా పేరుతో పార్టీ పటిష్టత కోసం పిసిసి కొత్త అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అలుపెరుగని ప్రయాణం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే వుంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక విషయంలో రేవంత్‌ రెడ్ది ఏం చేశారన్నది (బ్రహ్మ రహస్యమేమీ కాదు. తన మార్కును, మార్పును చూపించాల్సిన సమయంలో ముందే చేతులెత్తేశాడు. ఆరు నెలల నుంచి రెండు పార్టీలు అలపెరగని ప్రచారం చేస్తుంటే గుడ్లప్పగించి చూసింది ఎందుకు? క్షేత్ర స్థాయిలో ఎంతో కొంత బలంగా వున్న కాంగ్రెస్‌ కు కోరి, కోరి కొత్త కష్టం ఎందుకు తెచ్చారు. గత ఎన్నికలలో 1683 ఓట్లు వచ్చిన బిజేపి బలడానికి కారణమై, నామినేషన్‌ ఆఖరు రోజు దాకా ఊగిసాలడడంలో ఆంతర్యం అర్ధం కానీదా? హుజూరాబాద్‌ నా వల్ల కాదని చేతులెత్తేయడానికేనా ఇంత హంగామా చేసింది. ఇప్పుడు ముప్పై లక్షల సభ్యత్వం సాధించాలని కోరితే జరిగేదేనాపని.

హుజూరాబాద్‌ విషయంలో కాంగ్రెస్‌ కప్పగంతులే: ఈటెల రాజేందర్‌ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన దగ్గర నుంచి టిఆర్‌ఎస్‌, బిజేపి కనిపించిన ఆతృత కాం(గ్రెస్‌ లో కనిపించలేదు. ఇప్పుడు కూడా లేదు. ఎందుకు? రాజకీయాలలో సహకారాలనేవి ఎన్నికల నాడు క్షేత్ర స్థాయిలో పనిచేస్తాయని అనుకోవడం భ్రమ. ఏ ఏ పార్టీ అయినా తమకు ఓటేయమని ప్రచారం చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్‌ ఏం ప్రచారం చేస్తోంది. కాం(గైస్‌ పార్టీతో ఆనుబంధం వున్న వాళ్లు ఏం (ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అవకాశం కాంగ్రెస్‌ వదులుకోవడం తప్పిదం కాదా? రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు వుండరు. వ్యవస్థలుగానే కాదు, వ్యక్తులుగా కూడా కలిసిపోతారు. సమాజం కోసం (ప్రగతి కోసం అంటూ చెబుతారుతాజాగా టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ను దూషించినంతగా ఎవరినీ దూషించకపోయి వుండొచ్చు. ఇప్పుడు మేం మంచి మిత్రలం అనుకుంటున్నారు. టిఆర్‌ఎస్‌ గూటికి చేరారు. మరి కాంగ్రెస్‌ పార్టీకి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అన్న దానిని ఎంతో ప్రతివ్రాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు విస్తరించింది. శత్రువు, శత్రువు మిత్రలే కాని, సమయమొస్తే రాజకీయాలలో మిత్రులు కూడా శత్రువులేఈ చిన్న లాజిక్‌ రేవంత్‌ రెడ్ది మర్చిపోయారా? ఎవరైనా ఆయనను మార్చారా? గత ఎన్నికలలో కాంగైస్‌ ఓటు బ్యాంకు అరవై వేలు. ఇది తెలంగాణ లోని అన్ని నియోజకవర్హాల కన్నా మెరుగైనది. ఆ బలమంతా కాంగ్రెస్‌ దే. నాడు బిజేపి బలం, దాని ముందు అతి తక్కువ.

ఈటెల రాజేందర్‌ బిజేపి గూటికి చేరడంతో టిఆర్‌ఎస్‌ బలం తగ్గుతుందే గాని, కాం([గైస్‌ బలం తగ్గదు. కౌశిక్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ లో చేరినా, ఆయన వెంట వెళ్లింది తక్కువేఈటెల రాజేందర్‌ తో టిఆర్‌ఎస్‌ నుంచి బిజేపికి వెళ్లిన వాళ్లే ఎక్కువ. ఓటు మార్చిడి అన్నది ఆ రెండు పార్టీలు పంచుకున్నా అటు కేంద్ర, ఇటు రాష్ట్ర రాజకీయాలతో విసిగిన వారి సైలెంట్‌ ఓటు కాంగ్రెస్‌ దే కదా! ఇది కాంగ్రెస్‌ ఎందుకు మిస్సైంది. (ప్రెసిడెంట్‌ మారితే: గడచిన ఐదేళ్ళ కాలంగా ఎక్కుడ విన్నా ఇదే మాట. ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ మీద ప్రేమ వుంది. తెలంగాణ ఇచ్చిందన్న అభిమానం వుంది. అయినా పార్టీ గెలవకపోవడానికి కారణం నాటి పిసిసి. అధ్యక్షుడు అని అందరూ అనుకున్న మాటే. కానీ కొత్త పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పార్టీలో నింపుతున్న జోష్‌ అందరికీ నచ్చింది. పార్టీకి పూర్వవైభవం వస్తున్న నమ్మకం ఇప్పుడిప్పుడే కలుగుతోంది. ఇలాంటి తరుణంలో వచ్చిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో రాజకీయ వ్యూహం పేరుతో వేసిన ఎత్తుగడ మాత్రం ఎన్నికల తర్వాత విమర్శలవాలౌతుందని చెప్పడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *