netidhatri news

మావోయిస్టు కరపత్రాలు

మావోయిస్టు కరపత్రాలు వాజేడు మండలకేంద్రంలో శనివారం రాత్రి మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. జల్‌, జంగల్‌, జమీన్‌పై ఆధికారం ప్రజలదేనని నినదిస్తూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసులను అడవి నుంచి గెంటివేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేఖంగా ప్రజాస్వామిక వాదులు, ఆదివాసులు, అన్నివర్గాల ప్రజలు పోరాడాలన్నారు. న్యాయస్థానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను నిర్వాసితులను చేయాలనే కుట్రకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. సాయంత్రం మావోయిస్టులు మండలకేంద్రంలో కరపత్రాలు వదిలివెళ్లడం సంచలనంగా మారింది. ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read More

అక్రమార్కులపై ఎమ్మెల్యే ‘చల్ల’ని చూపు

అక్రమార్కులపై ఎమ్మెల్యే ‘చల్ల’ని చూపు ఆయనో ఎమ్మెల్యే, రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కాంట్రాక్టర్‌గా పేరుగాంచి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సహజవనరులను దర్జాగా నమిలి వేస్తూ కోట్లు కూడబెట్టాడు. ఈయనగారు చేస్తున్న దందా ప్రస్తుత తరాలను, భవిష్యత్‌ తరాలను కూడా కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఎంత పెద్ద గుట్టలనైనా అవలీలగా మింగి వేస్తాడు. అనుమతుల సంగతి దేవుడెరుగు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కనుక పనులు చకచక జరిగిపోతాయి. కోట్లాది రూపాయలు జమ అయిపోతుంటాయి. ఇది ఎవరు ఇచ్చిన హక్కో…

Read More

మంత్రి చుట్టూ భజన బృందం

మంత్రి చుట్టూ భజన బృందం ఇటీవల పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రైవేట్‌ పీఎల వ్యవహారంపై ‘నేటిధాత్రి’ కథనాలను ప్రచురించింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పీఎల విషయంలో జాగ్రత్త, ప్రైవేట్‌ పీఎల నియామకానికి స్వస్తి పలకండని చెప్పి, ప్రభుత్వం కేటాయించే పీఎలను తానే నియమిస్తానని మంత్రుల ఇష్టా, ఇష్టాలకు సీఎం చెక్‌ పెడితే, అది కాదని చెప్పి ఎర్రబెల్లి ఏకంగా 20మంది పీఎలను నియమించుకున్నట్లు అందిన సమాచారంతో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ కథనం వెలువరించాం….

Read More

విజయవంతంగా బడిబాట ర్యాలీ…

విజయవంతంగా బడిబాట ర్యాలీ… ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని వరంగల్‌ అర్బన్‌ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి తల్లిదండ్రులను కోరారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం లష్కర్‌ బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థి సంపూర్ణ వికాసానికి ప్రభుత్వ పాఠశాలలోని బోధన సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ మండల విద్యాశాఖ అధికారి…

Read More

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో కాంగ్రెస్‌ను టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ఎస్‌డిఎల్‌సిఇ జంక్షన్‌ వద్ద ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ అలువాల కార్తీక్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలపై గెలిచి టిఆర్‌ఎస్‌ పార్టీలకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రంలో తొలిసారి దళితుడు సీఎల్పీ నాయకుడు కావడాన్ని జీర్ణించుకోలేక…

Read More

పుస్తకాల బరువు మోసేదెలా

పుస్తకాల బరువు మోసేదెలా విద్యాసంవత్సరం మొదలైంది…పాఠశాల తిరిగి ప్రారంభం కానున్నాయి…విద్యార్థుల పుస్తకాలు కొనటానికి తల్లితండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది…పాఠశాల యాజమాన్యాలు మాత్రం ప్రతి సంవత్సరం పుస్తక ఏజెన్సీలతో, వస్త్రాదుకాణాల యాజమాన్యాలతో కుమ్మక్కై దోచుకుంటున్నారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉల్లాసమైన వాతావరణం…విశాలమైన ఆటస్థలాలు లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాలల ముందు కనీసం పార్కింగ్‌ స్థలం కూడా లేని పాఠశాలలు నగరంలో చాలా వరకు ఉన్నాయి. ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు విరుద్దంగా బహుళ…

Read More

ప్రజా రక్షణే…మా ధ్యేయం

ప్రజా రక్షణే…మా ధ్యేయం వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో పోలీసులు ప్రజలకు భరోసాను కల్పించడమే కాకుండా నిత్యం నగరంలో శాంతిభద్రతలకై కంటిమీదకునుకు లేకుండా ప్రశాంత వాతావరణం కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నాము. నగరంలో నేరాలను నియంత్రించడం కోసం వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ డి.వి రవీందర్‌ ఆదేశాల మేరకు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ మా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాము. పోలీసులంటే బయపెట్టేవారు కాదు..పోలీసులంటే ప్రజాసేవకులమని నిరూపించుకుంటున్నామని, ఫ్రెండ్లీ పోలీసుతో ప్రజలకు మేము మరింత చేరువయ్యామని, ప్రజలకు పోలీసులపై అపారనమ్మకం ఏర్పడిందని…

Read More

‘షాని’కెళ్లద్దు…బిడ్డో….!

‘షాని’కెళ్లద్దు…బిడ్డో….! వద్దు బిడ్డా..లేనిదానికి కానిదానికి వెళ్లద్దు…ఉన్నంతలోనే వుండాలి. అందేకాడికే అందుకోవాలి, ఉన్నంతలోనే సర్దుకోవాలి. బయటికి కనిపించేదంతా అద్భుతం కాదు..మెరిసేదంతా బంగారం కాదు..ఇలాంటి మాటలు మన పెద్దోళ్లు చాలా మందికి చెబుతుంటారు. అయినా పెడచెవిన పెడుతూ కొందరు మెరిసేదంతా బంగారమే అన్నట్లు ఊహలలో తేలిపోతుంటారు. అసలు విషయం తెలుసుకునేలోపే జరగాల్సి నష్టం, సమయం అన్ని జరిగిపోతాయి. తీరా తలలు పట్టుకుంటే ఏం లాభం..? ఇది జగమెరిగిన సత్యం.నగరంలో పేద, మద్యతరగతి కుటుంబాల్లో తమ పిల్లలను ఓ ప్రైవేటు స్కూల్‌కు…

Read More

ఇంటింటికి బడిబాట

ఇంటింటికి బడిబాట మండలంలోని కొండాపురం గ్రామంలో అంగన్‌వాడీ కార్యక్రమంలో భాగంగా బడిబాట నిర్వహించారు. ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమంలో 5సంవత్సరాలలోపు పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నపిల్లల మేథో వికాసాభివృద్దికి ఎంతోగానో తోడ్పడుతాయని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలను చేర్పిస్తే పోషకాహారంతోపాటు ఉచితవిద్య, ఆరోగ్యం, భాష అభివద్ధి గురించి పిల్లల తల్లిదండ్రులలో అవగాహన కలిగించారు. అనంతరం చిన్నపిల్లలకు ఆక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో గ్రామంలోని చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ…

Read More

కార్పొరేటర్‌ తండ్రి కావరం

కార్పొరేటర్‌ తండ్రి కావరం ఆయనో కార్పొరేటర్‌ తండ్రి. కొడుకు ఆవేశానికి గురైతే అలా కాదు…ఇలా అని సర్థిచెప్పాల్సినోడు రాజకీయం అంటే ఏంటో చెప్పి కొడుకు జనం తరుపు నాయకుడిగా ఎదిగేలా చేయాల్సినోడు కానీ కొడుకు కంటే ముందు తండ్రికే ఓపిక లేకుండాపోయింది. తనయుడి కార్పొరేటర్‌ పెత్తనాన్ని తనకు ఉన్న కావరాన్ని కలగలిపి డివిజన్‌ ప్రజలపై విరుచుకుపడ్డాడు. నా కొడుకునే నల్లా నీళ్లు కావాలని అడుగుతారా…డివిజన్‌లో నీటి కొరత ఉందని ఫిర్యాదు చేస్తారా…? కార్పొరేటర్‌ అయిన నా కొడుకు…

Read More

గుట్కాల పట్టివేత

గుట్కాల పట్టివేత వరంగల్‌ క్రైమ్‌, నేటిధాత్రి : మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శంభునిపేట ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన 27వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు బుధవారం స్వాదీనం చేసుకున్నామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు. శంభునిపేటకు చెందిన ధర్మపురి రమేష్‌ ఇంట్లో తనిఖీ చేయగా గుట్కాలు లభించాయని, రమేష్‌పై కేసు నమోదు చేశామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు.

Read More

నేనే మేయర్‌…నేనే ఎమ్మెల్యే నేనంటే నేనే

నేనే మేయర్‌…నేనే ఎమ్మెల్యే నేనంటే నేనే కార్పొరేటర్‌ నుంచి మేయర్‌గా, ఆ తరువాతి సమీకరణలతో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నన్నపనేని నరేందర్‌ వరంగల్‌ తూర్పుతో సహా గ్రేటర్‌ వరంగల్‌ అంతా తన పెత్తనం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పెత్తనం ఎక్కడి వరకు వెళ్లిందంటే గ్రేటర్‌ కాకుండా వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తంగా తన పరపతి ఏంటో చూపించుకునే స్థాయికి నరేందర్‌ గూర్చి ఆ పార్టీ నాయకులే కొంతమంది ఎమ్మెల్యేకు ముందు, ఎమ్మెల్యే తరువాత…

Read More

కార్మిక చట్టాలు అమలు చేయాలి

కార్మిక చట్టాలు అమలు చేయాలి నర్సంపేట పట్టణంలో వివిధ దుకాణాలలో పనిచేస్తున్న గుమస్తాలకు కార్మికచట్టాలు అమలుచేయాలని కోరుతూ జిల్లా లేబర్‌ అధికారి రమేష్‌బాబుకు టీఆర్‌ఎస్‌ కెవి ఆద్వర్యంలో అవినీతిపత్రాన్ని అందజేశారు. టిఆర్‌ఎస్‌ కేవి రాష్ట్ర నాయకురాలు నల్లా భారతి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజులు మాట్లాడుతూ గుమస్తాలకు ఎనిమిదిగంటల పని విధానం అమలుకావడం లేదని, రోజుకు 12గంటలు పనిచేయడం వల్ల మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారాంతపు సెలవులు అమలుకావడం లేదని, కార్మికులు పనిచేసే…

Read More

అంగన్‌వాడి టీచర్ల బడిబాట

అంగన్‌వాడి టీచర్ల బడిబాట హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో అంగన్‌వాడి టీచర్లు బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేయాలని, 5సంవత్సరాలకు పైబడి ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించాలని అంగన్‌వాడీ టీచర్లు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. ప్రతి గ్రామంలోని తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ప్రతి పిల్లవాడికి పౌష్టికాహారం, కోడిగుడ్లు, పాలు, విటమిన్లతో కూడిన ఆహారాన్ని పిల్లలకు అంగన్‌వాడీ టీచర్లు పెడుతున్నారని ఈ కార్యక్రమంలో…

Read More

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మండలంలోని అన్నారం షరీఫ్‌లోని యుపిఎస్‌ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమేశ్వర్‌ మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని అన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, 2జతల దుస్తువులు, అన్ని రకాల సౌకర్యాలు గల ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ విద్యాసంవత్సరం నుండి 1వ తరగతి నుండి ఇంగ్లీష్‌ మీడియంలో బోధన చేస్తున్నామన్నారు….

Read More

పోతరాజు విగ్రహం ధ్వంసం

పోతరాజు విగ్రహం ధ్వంసం మండలంలోని అన్నారం షరీఫ్‌ గ్రామ చెరువుకట్టపై గల పెద్దమ్మతల్లి గుడిలోని పోతరాజు విగ్రహాన్ని బుధవారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని ముదిరాజ్‌ కులసంఘము నేతలు ఘటనాస్థలికి చేరుకుని ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారినుండి ఫిర్యాదును స్వీకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More

దుండగుల దాడిలో వ్యక్తి మృతి

దుండగుల దాడిలో వ్యక్తి మృతి జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్‌ సెంటర్‌లోని శ్రీరామ సంతోష్‌లాడ్జ్‌లో గుర్తుతెలియని దుండగుల దాడిలో వ్యక్తి మృతిచెందాడు. అంబెడ్కర్‌ సెంటర్‌లోని టీ స్టాల్‌ యజమాని నాగరబోయిన కనకరాజు(50)ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

Read More

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం గ్రామంలోని పలు సమస్యల పట్ల, గ్రామాబివద్ధి లక్ష్యంగా సమీక్ష సన్నివేశాన్ని సర్పంచ్‌ బరిగెల లావణ్య అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామంలోని అంతర్గతరోడ్లు, మంచినీటి సౌకర్యం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని పనుల పట్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కెసిఆర్‌ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అన్నిరకాల వర్గాల ప్రజలకు అందేవిధంగా ప్రతి ఒక్కరు సహకరించుకోవాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రుతి, ఉపసర్పంచ్‌ బాషబోయిన శ్రీనివాస్‌, వార్డుసభ్యులు…

Read More

ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు

ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు మా ఊరికి ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు, ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనే మాకు ముఖ్యమని మందపల్లి గ్రామస్తులు ప్రైవేటు పాఠశాల బస్సును అడ్డుకున్నారు. నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో గురువారం నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని న్యూవిజన్‌ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు రావడంతో ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు, గ్రామసర్పంచ్‌, పంచాయతీ వార్డుసభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మొగ్గం మహేందర్‌, గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే…

Read More

బడి బస్సులు భద్రమేనా…?

బడి బస్సులు భద్రమేనా…? పాఠశాలలు మొదలయ్యాయి…పిల్లల ఫీజులు, పుస్తకాలు కొనటంలో విద్యార్థుల తల్లితండ్రులు తలమునకలు అవుతున్నారు. పుస్తకాల రేట్లు ఎమ్మార్పీ రేటుకు ఎక్కువ ఉన్నా, అసలు పుస్తకాలపై రేటు లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులుచేసి కొనవలసి వస్తుందని తల్లితండ్రుల వాదన. దూరప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు పాఠశాల యాజామాన్యం బస్సులు ఏర్పాటు చేస్తుంది. కానీ వాటికి ఫిట్‌నెస్‌ పరీక్షల నిమిత్తం ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన బస్సులు నేటివరకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకునేందుకు కార్యాలయం మొహం చూసిన పాపానపోలేదు. ఫిట్‌నెస్‌…

Read More