మహిళలు ఆర్థికంగా ఎదగాలి

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్, నేటిధాత్రి:
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న మహిళా పొదుపు సంఘాలకు శుక్రవారం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి రూ.కోటి చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పొదుపు సంఘాల ద్వారా
తీసుకున్న రుణాన్ని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి తోడ్పాటును ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్క మహిళ సంఘం సభ్యురాలు సమాజంతో ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. భూత్పూర్ మున్సిపాలిటీలో కొత్త ట్రాక్టర్లను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!