నర్సంపేట టౌన్,నేటిధాత్రి :
తెలంగాణలో నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా నర్సంపేట పట్టణంలోని స్థానిక బాలాజీ విద్యా
సంస్థల్లో భాగమైన అక్షర ద స్కూల్, ద్వారకపేట్ రోడ్ లో గల బిట్స్ స్కూల్ లో వనమహోత్సవం సంబంధించిన చిత్ర లేఖన పోటీలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల లోని చిన్నారులు,విద్యార్ధులు చెట్లను రక్షించాలి.. నీటిని పొదుపుగా వాడుకోవాలి.. భూమి కాలుష్యం
కాకూడదు అనే అంశం పైన పాఠశాల ప్రాంగణంలో చిత్ర లేఖన పోటీలు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.బాలాజీ సంస్థల చైర్మెన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మొక్కలు నాటిన అనంతరం మాట్లాడుతూ మానవాళికి అటవీ సంపద ఎంతో అవసరం వుందని చెప్పారు.వృక్షో రక్షిత రక్షిత అని మొక్కలను పెట్టి వాటిని
సంరక్షిస్తే అవి మనల్ని సంరక్షిస్తాయని ప్రతి ఒక్కరూ తన ఇంటి వద్ద మొక్కలు నాటలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ ఆర్. జ్యోతి గౌడ్ మాట్లాడుతూ కాలుష్యాన్ని
నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటి సంరక్షణ చేయాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల ట్రెజరర్ వనజ, సెక్రెటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, సిఏఓ సురేష్, ఉపాధ్యాయ బృదం, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.