పరామర్శ – గాయపడిన గీత కార్మికుడు ఎర్ర తిరుపతిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
మొగుళ్లపల్లి మండల టిఆర్పిఅధ్యక్షుడు బోనగిరి రాజేష్
మొగుళ్ళపల్లి నేటి దాత్రి జయశంకర్
భూపాలపల్లి జిల్లా, మొగుళ్ళపల్లి మండలం, పర్లపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు ఎర్ర తిరుపతి (40) తాటి చెట్టు దిగుతున్న సమయంలో మోకుజారి కిందపడడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు.
తక్షణమే అతన్ని చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన తిరుపతిని పరామర్శించిన టిఆర్పి మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్, పర్లపల్లి గ్రామ యువజన అధ్యక్షుడు కాశెట్టి రాజేష్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబానికి చెందిన తిరుపతిని ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని, పూర్తి వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. అలాగే, గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
