చెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చెస్ బోర్డుల పంపిణీ…

చెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చెస్ బోర్డుల పంపిణీ

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో గల ముఫై రెండు ప్రభుత్వ పాఠశాలలకు ఎన్ఆర్ఐ ముసుగు శ్రీనివాసరెడ్డి సహకారంతో ప్రతి పాఠశాలలో చదువుతున్న ప్రతి ఇరవై మందికి ఒక్క చెస్ బోర్డు చొప్పున నూటాఆరు చెస్ బోర్డులను స్థానిక రామడుగులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ పాఠశాలల నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు చెస్ బోర్డులను పంపిణీ చేయడం జరిగినది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి రంగనాథ శర్మ హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లు కలిగి ఉండాలని, మేదోసంపత్తి ఎదుగుదల, ఆత్మవిశ్వాసం, సరియైన నిర్ణయాలు తీసుకోవడం, మంచి భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశాలు పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉండేలా, తీర్చిదిద్దేందుకు చెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చెస్ బోర్డులు పంపిణీ చేస్తున్నామని తెలియజెప్పినారు. ఈకార్యక్రమంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ, రూపారాణి, కే.సురేష్, చెస్ నెట్వర్క్ ప్రోగ్రాం మేనేజర్, విద్యాసాగర్, రామడుగు మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version