ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు…

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కన్వీనర్ మారేపల్లి కొమురయ్య అధ్యక్షతన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య సిపిఐ ఎం ఎల్ లిరీబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డీలర్ స్వరూప విచ్చేసి ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లయ్య సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లీ మల్లేష్ మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను మూఢనమ్మకాలను రూపుమాపుతూ అందరికీ విద్యను అందిస్తూ వారి హక్కుల కొరకు పోరాడిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అని అన్నారు. ఆమె మహారాష్ట్రలోని సతార జిల్లాలో 1831 జనవరి 3న జన్మించి 18 97 మార్చి 10 ప్లేగు వ్యాధితో మరణించిందని తెలిపారు. ఆమె బాలికలకు మహిళలకు అందరికీ సమానంగా విద్యను అందించి వారి హక్కులు మూఢనమ్మకాలు కుల నిర్మూలన కొరకు పోరాడిన మహనీయులన్నారు. సావిత్రిబాయి పూలే తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే ద్వారా చదువు నేర్చుకుని 1848లో మొదటి పాఠశాలను ఏర్పాటు చేసిందనీ తెలిపారు. 1852లో మహిళ సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసిందన్నారు అలాగే 1853లో వితంతు మహిళ అనాధ శిశువుల కోసం సేవాసదానం ప్రారంభించింది అన్నారు 1872లో బ్రాహ్మణ వితంతు కుమారుడి యశ్వంత్ ని పిల్లలు లేనందున దత్తత తీసుకున్నారని చెప్పారు. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ తన కుమారుడికి కులాంతర వివాహం జరిపిందన్నారు. 1896లో కరువు వచ్చి అల్లాడిపోతున్న ప్రజలను రక్షిస్తూ మరో పక్క ప్లేగు వ్యాధిత బాధపడుతున్న ప్రజలకు అన్ని విధాల ప్లేగు వ్యాధి నుంచి కాపాడిందని తెలిపారు. చివరకు సావిత్రిబాయి పూలే కు ప్లేగు వ్యాధి సోకి 1897 మార్చి 10న మరణించిందనీ తెలిపారు
ఈ కార్యక్రమంలో టేకుమట్ల సర్పంచ్ మాట్ల శ్రీనివాస్ బూర్ణపెళ్లి సర్పంచ్ నేరెళ్ల రామకృష్ణ సర్పంచ్ తోట సాగర్ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్ రామ్ చందర్ అంబేద్కర్ యువజన సంఘం టౌన్ మాజీ అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ మాజీ ఉపసర్పంచ్ నిమ్మల స్వామి మాజీ ఉప సర్పంచ్ మచ్చ రాజయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version