పుణ్యక్షేత్రాలు విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు
ఇందు డిపో మేనేజర్ భూపాలపల్లి
భూపాలపల్లి నేటిధాత్రి
పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆర్టిసి టూర్ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు ఒక ప్రకటనలో తెలిపారు భూపాలపల్లి ఆర్టీసి డిపో మేనేజర్ ఇందు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఒక్క రోజులో భూపాలపల్లి నుండి కొమురవెల్లి, కొండ పోచమ్మ వేములవాడ, కొండా గట్టు, ధర్మపురి సందర్మించి రాత్రి భూపాలపల్లికి బస్సు చేరుకుంటుందని. ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు :-680/-
ఒక్క రోజులో భూపాలపల్లి నుండి భద్రచలం, పర్ణశాల , మల్లూరు దేవాలయాలను సందర్మించి రాత్రి భూపాలపల్లికి ఎక్స్ప్రెస్ బస్సు చేరుకుంటుందని. ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు:- 700
ఒక్క రోజులో భూపాలపల్లి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సందర్మించి రాత్రి భూపాలపల్లికి ఎక్స్ప్రెస్ బస్సు చేరుకుంటుదని . ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు:-770/-
రెండు రోజులలో భూపాలపల్లి నుండి బీజపల్లి ఆంజనేయ స్వామి ఆలయం ఆలంపూర్ జోగులాలు దేవాలయాలను సందర్శించి మరుసటి రోజు రాత్రి భూపాలపల్లికి సూపర్ లగ్జరీ చేరుకుంటుదని ఒక్కొక్కరికి రానూ -పోనూ చార్జీలు:- 1700/-
రెండు రోజులలో భూపాలపల్లి నుండి విజయవాడ కనక -దుర్గా అమ్మవారి దేవాలయం, అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి సందర్శించుకొని మరుసటి రోజ రాత్రి భూపాలపల్లి కి సూపర్ లగ్జరీ చేరుకుంటుదని ఒక్కొక్కరికి రానూ…పోనూ చార్జీలు :-2150/-
ఇలా ఐదు రూట్లలో పుణ్యక్షేత్రాలు బస్సులు నడపాలని నిర్ణయించాముని, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.
పూర్తి సమాచారం కోసం :- 9959226707, 9701967519, 9849425319, 9908336391