సమన్వయంతో మహా శివరాత్రి మహోత్సవములు విజయవంతం చేయాలి…

సమన్వయంతో మహా శివరాత్రి మహోత్సవములు విజయవంతం చేయాలి.

#ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించాలి.

#ఈ నెల 15 నుంచి 17 వరకు జాతర నిర్వహణ.

#భక్తుల నుంచి ఫిర్యాదు రాకుండా ఏర్పాట్లు చేయాలి

#జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు, నేటిధాత్రి:

 

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మహా శివరాత్రి మహోత్సవములు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ రెవిన్యూ సి. హెచ్. మహేందర్ జి,
ఆర్డీఓ వెంకటేష్, రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఈవో లతో కలిసి ఆయా శాఖల అధికారులతో జాతర సమన్వయ సమావేశం నిర్వహించారు.
మహా శివరాత్రి జాతర సందర్భంగా పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్డు నిర్వహణ, దేవాలయం వద్ద వసతి సౌకర్యం, త్రాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్ ల ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం, హెల్ప్ సెంటర్ ఏర్పాటు సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాల పై సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేసుకున్న ప్రణాళికను వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
జాతర కు వచ్చే భక్తుల సంఖ్య దృష్ట్యా పటిష్ట భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.
పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, రోడ్డుకు ఇరు వైపులా పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
భక్తుల కోసం అవసరమైన మేర పందిర్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
జాతర సందర్భంగా వచ్చే భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ చలి వేంద్రాలను, చలువ పందిరిలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ పరిసరాలలో అపరిశుభ్రత కాకుండా పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
జాతర సందర్భంగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమైన ప్రదేశాలలో అన్ని పందిళ్ళ వద్ద మంటలు ఆర్పే ఫైర్ యంత్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో మినీ మేడారం జాతరలకు ఏర్పాట్లు చేయాలి…

జిల్లాలో మినీ మేడారం జాతరలకు ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లాలో నిర్వహించనున్న మినీ మేడారం జాతరలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ రాజ్, విద్యుత్, ఇంజనీరింగ్, మిషన్ భగీరథ, గిరిజన సంక్షేమ శాఖ, తహసీల్దార్లు,
ఎంపీడీఓలు తదితర శాఖల అధికారులతో మినీ మేడారం జాతరల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జాతర ప్రాంగణంలో పొదలు, పిచ్చి మొక్కలు తొలగించాలని, భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, మరుగుదొడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. జాతర సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ ద్వారా పరిశుబ్రమైన త్రాగునీరు అందించాలని ఆదేశించారు. జాతరలు జరిగే మార్గాల్లో రోడ్లకు ఇరువైపుల పొదలు, పిచ్చి మొక్కలు తొలగించాలని, మూల మలుపుల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా స పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీఓలు జాతర జరిగే ప్రదేశాలను పరిశీలించి చేయాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జాతరలు నిర్వహించే మండలాల్లో మండల ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని, భూపాలపల్లి మండలంలో కమలాపూర్, గుర్రంపేట ప్రాంతాల్లో రెండు జాతరలు జరుగు తున్నందున ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మినీ మేడారం జాతరలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సీపీఓ బాబురావు, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారులు సునీల్, బాబురావు, విద్యుత్ శాఖ డీఈ రాజిరెడ్డి, ఆర్డీవో హరికృష్ణ, డీఎల్పీఓ మల్లికార్జున రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version