ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా తగు చర్యలు…
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత – శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మున్సిపాలిటీలోని ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని క్యాతనపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత- శ్రీనివాస్ అన్నారు.మున్సిపాలిటీలో 10 వ వార్డ్ కౌన్సిలర్ వీణంక శ్రీనివాస్, 21 వ వార్డ్ కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత లతో కలిసి 22 వ వార్డులో సైతం డ్రైనేజీ వ్యవస్థల శుభ్రపరిచే కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత మాట్లాడారు. వార్డుల్లోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాలువలు, డ్రైనేజీలు శుభ్రపరుస్తున్నామని, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ హాజరయ్యారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన వాతావరణము కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజల ఆరోగ్యమే మొదటి ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమాలలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
