ప్రజా పాలనలో భాగంగా స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం…

ప్రజా పాలనలో భాగంగా స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం

చీకటాయపాలెం సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శుభ్రత చర్యలు
అంగన్వాడీ కేంద్రాల తనిఖీ..

పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

 

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా చీకటాయపాలెం గ్రామ సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి గ్రామంలోని పాఠశాల పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షిస్తూ శుభ్రపరిచే పనులను దగ్గరుండి చేయించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను కూడా ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న సేవలు, సదుపాయాలపై అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు అందించే ఆహారం, పరిశుభ్రత ప్రమాణాలు సక్రమంగా పాటించాలని సూచించారు.
అలాగే పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల పరిసర ప్రాంతాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సర్పంచ్ సూచించారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు కూడా ఈ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
గ్రామంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యమని సర్పంచ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version