మున్సిపల్ ఎన్నికల ప్రచారం: ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ

*మున్సిపల్ ఎన్నికల ప్రచారం: ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ*

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, 14వ వార్డు అభ్యర్థి మొహమ్మద్ రఫీ కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మొహమ్మద్ రఫీ, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, మురుగు కాలువల నిర్వహణకు శాశ్వత పరిష్కారం,
చర్యలు, మెరుగైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ ఎన్నికలలో ఎంఐఎం పార్టీకి భారీ మెజారిటీతో విజయం అందించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా వారు ఇంటింటా తిరుగుతూ ప్రజలతో ఓటును అభ్యర్థించారు.ఈ సందర్భంగా అభ్యర్థి మొహమ్మద్ రఫీ,మాట్లాడుతూ వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చేస్తామని ఎంఐఎం పార్టీ నుంచి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు పాల్గొన్నారు.

15 వ వార్డులో కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు..

15 వ వార్డులో కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు

స్పందించిన మాజీ కౌన్సిలర్ బండారు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో 15వ వార్డు శ్రీ రామ టాకీస్ హై స్కూల్ రోడ్ లో కాలువలో మురికి మట్టి పేరుకపోవడంతో వార్డు ప్రజలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ దృష్టికి తీసుకపోవడంతో స్పందించిన ఆయన మున్సిపల్ కమిషనర్ కు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి సిబ్బంది బాలరాజు దగ్గరుండి కార్మికులచే మట్టిని జె సి బి తో తీసివేయించారు .ఈ మేరకు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డికి 15వ వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version