ట్రంప్, పుతిన్ భేటీ వాయిదా.. ఎందుకంటే..

ట్రంప్, పుతిన్ భేటీ వాయిదా.. ఎందుకంటే..?

 

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను, రష్యా అధ్యక్షుడు పుతిన్ హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో సమావేశం అవుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ సమావేశం వాయిదా ప్రస్తుతానికి వాయిదా పడింది. మళ్లీ భవిష్యత్తులో ఈ సమావేశం జరుగుతుందనే అంశంపై స్పష్టత లేదని వైట్ హౌస్ వెల్లడించింది.

 రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేయ లేదు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లు ద్వారా చర్చించుకున్నారు. అనంతరం ఈ ప్రకటన జారీ అయింది. ట్రంప్, పుతిన్‌ల మధ్య బుడాపెస్ట్‌లో సమావేశం జరగనుందంటూ గత వారం ఒక ప్రకటన వెలువడిన విషయం విదితమే.

అయితే ఈ సమావేశం నిలిచిపోయేందుకు స్పష్టమైన కారణాలు అయితే లేవని అమెరికా స్పష్టం చేసింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఉపయోగం లేని ఈ భేటీ ద్వారా సమయం వృధా చేసుకోవాలంటూ తనదైన శైలిలో ఆయన తెలిపారు. ఈ చర్చల వల్ల ఎలాంటి ఆశాజనక పరిణామాలు ఉండవని ట్రంప్ వెల్లడించారు. అయితే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొన్ని నెలలుగా సాగుతోంది.దాంతో ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణపై చర్చలకు ట్రంప్, పుతిన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వీరు మరికొద్ది రోజుల్లో బుడాపేస్ట్‌లో సమావేశం కావాల్సి ఉంది. ఇక వీరి భేటీపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సైతం స్పందించింది. భవిష్యత్తులో వీరి భేటీ సందేహమేనంటూ అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ కాల్పుల విరమణకు ముందు ఉక్రెయిన్ మరిన్ని భూభాగాలను వదులుకోవడానికి అంగీకరించాలంటూ మాస్కో చాలా కాలంగా డిమాండ్ చేస్తోన్న విషయం విదితమే.

ట్రంప్-పుటిన్ అలాస్కా సమ్మిట్: భారత్ టారిఫ్ సమాచారం…

ఈ వారంలో అతి పెద్ద అలాస్కా సమ్మిట్‌లో US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ సమావేశమయ్యారు. సమ్మిట్ తర్వాత, ట్రంప్ రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై అదనపు టారిఫ్‌లను విధించకోవచ్చని సంకేతం ఇచ్చారు. ఈ సమావేశం రష్యా-యుక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా విశేషంగా గమనించబడింది.
పైగా, ఇండస్ వాటర్స్ ట్రిటీ విషయంలో పాకిస్తాన్ న్యూక్లియర్ హెచ్చరికలు ఇచ్చింది. ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ప్రధాని షరీఫ్, బిలావాల్ భుట్టో భారత్‌ను హెచ్చరించారు. ట్రంప్ భారత్, చైనా పట్ల రష్యన్ ఆయిల్ టారిఫ్‌లలో భిన్నమైన విధానాన్ని చూపడం గమనార్హం.
ఇతర ఘటనల్లో, గాజాలో ఇజ్రాయిల్ ఎయిర్‌స్ట్రైక్స్‌లో అల్-జజీరా జర్నలిస్ట్ అనాస్ అల్-షరీఫ్ మరణించారు. చైనాలో యువకులు ఉద్యోగం కనిపించేలా కనిపించడానికి చెల్లిస్తున్నారు. అలాగే, ఒక వైరల్ వీడియోలో కిల్లర్ వేల్ లైవ్ షోలో ట్రైనర్‌ను అటాక్ చేసింది. 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version