గుండంపల్లిలో నవోదయ విజేతకు ఘన సన్మానం….

గుండంపల్లిలో నవోదయ విజేతకు ఘన సన్మానం
మల్లాపూర్ మార్చి 24 నేటి ధాత్రి

ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నవోదయ ప్రవేశపరీక్షలో విజయాన్ని సాధించిన గుండంపల్లి గ్రామానికి చెందిన జక్కుల నవదీప్‌ను జువ్వాడి కృష్ణారావు ఘనంగా సన్మానించారు.
గుండంపల్లి గ్రామం నుండి తొలిసారిగా నవోదయ సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవదీప్ సాధించిన విజయాన్ని గ్రామ ప్రజలు అభినందిస్తూ, అతని భవిష్యత్తు మరింత ఉజ్వ లంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మనర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడ్పుల పుష్పలతనర్సయ్య, బెజ్జరపు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి, గంగాధర్,మధు గంగారెడ్డి, తిరుపతి, గంగరాజం, నరేష్ విజయ్, క్రాంతి, కిరణ్, దినేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

పాతూరి సాధనకు పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా ప్రదానం…

పాతూరి సాధనకు పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా ప్రదానం

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన పాతూరి సాధనకు జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 56, 57, 58వ బ్యాచ్‌ల కంబైన్డ్ కాన్వకేషన్ కార్యక్రమం సోమవారం రాజేంద్రనగర్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతులమీదుగా సాధన పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టాను స్వీకరించారు. ఇదే విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీతో పాటు పీహెచ్‌డీ వరకు పూర్తి చేయడం విశేషంగా నిలిచింది.

సాధన తల్లిదండ్రులు పాతూరి నరసింహారావు, శారద తమ కుమార్తె సాధించిన ఈ ఘన విజయాన్ని తమ జీవిత కష్టాలకు లభించిన ఫలితంగా పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే, సాధన భర్త మధుర గీత్, మామగారు రావెళ్ల రామారావు (వరంగల్ స్పెషల్ బ్రాంచ్ సబ్‌ఇన్‌స్పెక్టర్), అత్తయ్య సుగుణ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ సాధన భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి ఉన్నత విద్యలో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పలువురు ప్రశంసించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version