టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రతినిధులకు ఘన సన్మానం.
మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్.
నర్సంపేట నేటిధాత్రి:
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఐ.జే.యు ) వరంగల్ జిల్లా కమిటిలో ఎన్నికైన నర్సంపేట డివిజన్ కు చెందిన జర్నలిస్టు ప్రతినిధులకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ సన్మానించారు. బుధవారం వరంగల్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభ జరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా నూతన కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించారు. నర్సంపేట డివిజన్ నుండి జిల్లా కోశాధికారి కోదాటి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు మహాదేవుని జగదీష్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కందుల శ్రీనివాస్ గౌడ్, శీలం రమేష్,కంచర్ల కుమార్, మహమ్మద్ చాంద్ పాషా, పల్లెల్ల సోమేశ్వర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గురువారం నర్సంపేట మార్కెట్ కమిటి చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబులు నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే ఐజేయు నర్సంపేట డివిజన్ ప్రతినిధులను మార్కెట్ కమిటి కార్యాలయంలో శాలవాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ కొనసాగాలన్నారు.