ఘనంగా అభయ ఆంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవం

ఘనంగా అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవం

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గుల్మోహన్ పార్క్ నేతాజీ నగర్ లో శ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం రెండవ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. శనివారం ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో ఆలయ రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కాలనీ లో తెల్లవారుజామున బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ శివ నాగేంద్ర స్వామి దేవాలయంలో అర్చనలు నిర్వహించిన అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం విగ్నేశ్వర పూజలతో ప్రారంభమై హనుమాన్ విగ్రహానికి అభిషేకం నిర్వహించిన వేద బ్రాహ్మణులు హోమం నిర్వహించారు. కాలనీవాసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు వేలాదిమంది హాజరై ప్రత్యేక పూజలు తమ మొక్కులను తీర్చుకున్నారు.

అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఉరిటి వెంకటరావు, రాగం మల్లికార్జున్ యాదవ్, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, సురేందర్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆశనోళ్ళ వెంకటేష్ గౌడ్, కోశాధికారి రామేశ్వరం రెడ్డి, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు ఏ. మల్లేష్ ముదిరాజ్, ఎం. సంతోష్ కురుమ, ఆర్ రమేష్ బాబు, సంయుక్త కార్యదర్శిలు ఎం మహేష్ కురుమ, బుచ్చన్న, ఉప్పరి దయాసాగర్, కార్యనిర్వాహక కార్యదర్శిలు లావా చారి, యాదగిరి సాగర్, ఎం శ్రీను కురుమ, సాంబరాజు, కార్యవర్గ సభ్యులు పి. నర్సిరెడ్డి, సోమేశ్ రెడ్డి, డి. కుమార్ తదితరులు పాల్గొన్నారు.

న్యాల్కల్‌లో 359వ పీర్ గయాబ్ ఉర్సు పోస్టర్ ఆవిష్కరణ

న్యాల్కల్ లో 359వ పీర్ గయాబ్ ఉర్సు షరీఫ్ పోస్టర్ ఆవిష్కరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండల కేంద్రంలో 359వ పీర్ గయాబ్ సబ్ ఉర్సు షరీఫ్ కు సంబంధించిన పోస్టర్ ను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ వేడుకలు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 6, 2026 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, చాదర్ సమర్పణ, కవ్వాలీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉర్సు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని వర్గాల భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణతో గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాల్లో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని తమ మొక్కులను చెల్లించుకుని విజయవంతం చేయగలరని నిర్వాహకులు కోరారు,

తేది.30-01-2026 శుక్రవారం రా॥ 8 గంలకు మాలి పటేల్ స్వర్గీయ ఉస్మాన్ పటేల్ గారి ఇంటి నుండి సర్కారి గంధం ఊరేగింపు

తేది. 31-01-2026 శనివారం కూరగాయల సంత, న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాల గ్రామాల నుండి గంధం ఊరేగింపు

తేది: 01-02-2026 ఆదివారం మరియు సోమవారం తెలంగాణ రాష్ట్రం కాకుండ మహారాష్ట్రం నుండి మేలైన పశువుల & మేకల సంత రోజుల సంత

బిరుగును. మేలైన పనివులకు శ్రీమతి శ్రీ ధోతి గిరిజాబాయి – అడినప్పు మరియు హెచ్. సురేష్ గార్ల జ్ఞాపకార్థంపై

డా. హొతి బస్వరాజ్, పశువులకు పోశకులకు ప్రోత్సాహకాలు అందజేత, రాత్రి హద్నూర్ గ్రామం నుండి గంధం ఉరేగింపు ఖవ్వాలి జరుగును.

తేది. 02-02-2026 సోమవారం న్యాల్కల్ గ్రామం నుండి ఖురేషి వారి గంధం మరియు బ్రహ్మాడంగా ఖవ్వాలి దర్గ దగ్గర జరుగును మరియు మండలంలోని గుంజెక్ట్, అత్నూర్, డప్పూర్, రుక్మాపూర్, చిలిగెపల్లి, గెజింతల్, మెటల్ కుంట, ముంగి, రాంతీ, ఎల్లోయి గ్రామాల నుండి గంధము వచ్చును.

బి. జ్యోతి – ప్రవీణ్ రూ.25,000/- రెశెట్టి పాటిల్ 20,051/-

5 తులాల వెండి జి. తిరుపతి రెడ్డి, 5 తులాల వెండి యం. సిద్ధలింగయ్య స్వామి, 5 తులాల వెండి పడనంటి వెంకట్, 5 తులాల వెండి అబ్దుల్ ఖాదర్ ఖురేశ కీ.శే. గొల్ల విశత జ్నాపకార్ధం – గొల్ల దత్తు 5 తులాల వెండి షీల్డ్, & అరుణ శ్రీనివాస్ రెడ్డి ముంగి గ్రామ సర్పంచ్ 5 తులాలల వెండి.

కర్నాటక, ఆంధ్రా, మహారాష్ట్ర పాల్గొంటారు.

తేది. 04-02-2026 బుధవారం రోజున న్యాల్ కల్ వర్గ దగ్గరగాయల సంత జరుగును.

తేది. 05-02-2026 గురువారం రోజున రాత్రి 9-00 గం॥లకు ఖవ్వాలి మరియు బజన జరుపబడును.

తేది 06-02-2026 శుక్రవారం రోజున ఉ॥ భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేత

జనవరి 11నుంచి హజరత్ మాషూక్-ఎ-రబ్బాని 470వ దర్గా ఉత్సవాలు.

జనవరి 11నుంచి హజరత్ మాషూక్-ఎ-రబ్బాని 470వ దర్గా ఉత్సవాలు.

వరంగల్ నేటిధాత్రి.

 

ఈ నెల 11, 12, 13 తేదీల్లో వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో ఉన్న హజరత్ మాషూక్-ఎ-రబ్బాని 470వ దర్గా ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి నవీద్ బాబా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాషూక్-ఎ-రబ్బాని దర్గాలో ఉత్సవాల గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. నవీద్ బాబా తెలిపిన ప్రకారం, జనవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు దర్గా పీఠాధిపతి నివాసంలో ఫాతిమాతో ఉరుఫ్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 12వ తేదీన రాత్రి 9 గంటలకు సందల్ సాని మరియు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. 13వ తేదీన ఖురాన్ పఠనం అనంతరం హజ్రత్ సయ్యద్ షా హైదర్ ఇల్లాలుద్దీన్ ఖాద్రి జిలానీకి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని ఆయన తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖలతో పాటు జిల్లా అధికారులు సమన్వయంతో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హజరత్ మాషూక్-ఎ-రబ్బాని 470వ దర్గా ఉత్సవాలను విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి నవీద్ బాబా కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version