న్యాల్కల్‌లో 359వ పీర్ గయాబ్ ఉర్సు పోస్టర్ ఆవిష్కరణ

న్యాల్కల్ లో 359వ పీర్ గయాబ్ ఉర్సు షరీఫ్ పోస్టర్ ఆవిష్కరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండల కేంద్రంలో 359వ పీర్ గయాబ్ సబ్ ఉర్సు షరీఫ్ కు సంబంధించిన పోస్టర్ ను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ వేడుకలు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 6, 2026 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, చాదర్ సమర్పణ, కవ్వాలీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉర్సు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని వర్గాల భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణతో గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాల్లో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని తమ మొక్కులను చెల్లించుకుని విజయవంతం చేయగలరని నిర్వాహకులు కోరారు,

తేది.30-01-2026 శుక్రవారం రా॥ 8 గంలకు మాలి పటేల్ స్వర్గీయ ఉస్మాన్ పటేల్ గారి ఇంటి నుండి సర్కారి గంధం ఊరేగింపు

తేది. 31-01-2026 శనివారం కూరగాయల సంత, న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాల గ్రామాల నుండి గంధం ఊరేగింపు

తేది: 01-02-2026 ఆదివారం మరియు సోమవారం తెలంగాణ రాష్ట్రం కాకుండ మహారాష్ట్రం నుండి మేలైన పశువుల & మేకల సంత రోజుల సంత

బిరుగును. మేలైన పనివులకు శ్రీమతి శ్రీ ధోతి గిరిజాబాయి – అడినప్పు మరియు హెచ్. సురేష్ గార్ల జ్ఞాపకార్థంపై

డా. హొతి బస్వరాజ్, పశువులకు పోశకులకు ప్రోత్సాహకాలు అందజేత, రాత్రి హద్నూర్ గ్రామం నుండి గంధం ఉరేగింపు ఖవ్వాలి జరుగును.

తేది. 02-02-2026 సోమవారం న్యాల్కల్ గ్రామం నుండి ఖురేషి వారి గంధం మరియు బ్రహ్మాడంగా ఖవ్వాలి దర్గ దగ్గర జరుగును మరియు మండలంలోని గుంజెక్ట్, అత్నూర్, డప్పూర్, రుక్మాపూర్, చిలిగెపల్లి, గెజింతల్, మెటల్ కుంట, ముంగి, రాంతీ, ఎల్లోయి గ్రామాల నుండి గంధము వచ్చును.

బి. జ్యోతి – ప్రవీణ్ రూ.25,000/- రెశెట్టి పాటిల్ 20,051/-

5 తులాల వెండి జి. తిరుపతి రెడ్డి, 5 తులాల వెండి యం. సిద్ధలింగయ్య స్వామి, 5 తులాల వెండి పడనంటి వెంకట్, 5 తులాల వెండి అబ్దుల్ ఖాదర్ ఖురేశ కీ.శే. గొల్ల విశత జ్నాపకార్ధం – గొల్ల దత్తు 5 తులాల వెండి షీల్డ్, & అరుణ శ్రీనివాస్ రెడ్డి ముంగి గ్రామ సర్పంచ్ 5 తులాలల వెండి.

కర్నాటక, ఆంధ్రా, మహారాష్ట్ర పాల్గొంటారు.

తేది. 04-02-2026 బుధవారం రోజున న్యాల్ కల్ వర్గ దగ్గరగాయల సంత జరుగును.

తేది. 05-02-2026 గురువారం రోజున రాత్రి 9-00 గం॥లకు ఖవ్వాలి మరియు బజన జరుపబడును.

తేది 06-02-2026 శుక్రవారం రోజున ఉ॥ భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేత

ఘనంగా దర్గా ఉర్సు ఉత్సవాలు…

ఘనంగా దర్గా ఉర్సు ఉత్సవాలు…

ఘనంగా దర్గా హజరత్ సయ్యద్ బుర్హాన్ ఉల్లా షా ఖాద్రీ ఉల్ చిష్టి(RA)వో బార్గా హజ్రత్ పౌపల్లా సయ్యద్ సుల్మాన్ షా ఖాద్రి ఉల్ ఛష్టి (RA) ఉర్స్ ఉత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలో తకియ ఆవరణలో ఉన్న దర్గా హజరత్ సయ్యద్ బుర్హాన్ ఉల్లా షా ఖాద్రీ ఉల్ చిష్టి మరియు హజరత్ పౌపల్లా సయ్యద్ సులేమాన్ షా ఖాద్రి ఉల్ చీష్టి ఉర్స్ దర్గా సజ్జాదనషీన్ సయ్యద్ షా జమీరుద్దీన్ ఖాద్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. ఇందులో భాగంగా దర్గాకు సందల్ సమర్పిస్తూ పెద్ద ఎత్తున ఖవ్వాలు కార్యక్రమం నిర్వ హించారు ఎందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. నిరంతరం సాయంత్రం కవ్వాల్ కార్యక్రమం హోరేత్యాయి ఇందులో దర్గాసజ్జాదనషీన్ సయ్యద్ షా జమీరుద్దీన్ ఖాద్రి ప్రజా ప్రతినిధులు, అతిథి లతో ప్రత్యేక సన్మానించారు, సయ్యద్ షా జమీరుద్దీన్ ఖాద్రి మాట్లాడు తూ.. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దర్గా లో సందల్ ఘనంగా నిర్వహించడం జరిగింది అదే విధంగా భక్తులు దర్శించు కున్నారు ఇందులో భారతదేశంలో ఉన్న పరిస్థితులను చూసి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అంటూ దర్శించుకున్నాను అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ముంతాజ్ షా,సయ్యద్ సదాక్ అలీ షా, సయ్యద్ ఫర్దీన్ షా,మాజీ కౌన్సిలర్, జాంగిర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకుడు, హజ్రత్ మొహమ్మద్ నిజాముద్దీన్ ఖలీఫా జహీరాబాద్, హజ్రత్ మహమ్మద్ అస్లం షా ఖాద్రి చిష్టి ఖలందరి హైదరాబాద్, మొహమ్మద్ అల్లావుద్దీన్ నవనిర్మాణ ప్రజా సమితి అధ్యక్షుడు, మొహమ్మద్ రబ్బానీ ఖాన్,సయ్యద్ షరీఫ్, సయ్యద్ ముసైబ్,మహమ్మద్ జాహూర్ షా,సయ్యద్ షా ఫహద్,సయ్యద్ ఫారిస్ షా, మరియు జ్యోతి పండాల్ సీనియర్ నాయకురాలు టీఅర్పి పార్టీ, సింగర్ సంధ్య జహీరాబాద్ ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version