రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న సీనియర్ జర్నలిస్ట్ దూరదర్శన్ ప్రతినిధి మల్యాల బాలస్వామి

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన దూరదర్శన్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ మలియాల బాలస్వామి గత నెల 25 న వనపర్తి గోశాల దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు . ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామి హైదరాబాదులో ఆర్థోపెడిక్ కేర్ హాస్పిటల్ డాక్టర్ తో చికిత్స చేయించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న నేటి దాత్రి దినపత్రిక జిల్లా విలేకరి పోలిశెట్టి సురేష్ బుధవారం నాడు నాగవరంలో జర్నలిస్ట్ బాలస్వామి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు .జర్నలిస్ట్ బాలస్వామి త్వరగా కోలుకొని జర్నలిస్ట్ విధుల్లో చేరాలని పొలిశెట్టి సురేష్ ఆకాంక్షించారు

13 ఫోన్ లను రికవరి చేసిన భూపాలపల్లి పోలీసులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సహాయంతో భూపాలపల్లి పోలీసులు పోగొట్టుకున్న 13 సెల్ ఫోను లను తక్కువ సమయంలో రికవరీ చేసి బాధితులకు అప్పగించామని డిఎస్పి సంపత్ రావు అన్నారు వివిధ సమయాల్లో బాధితుల సెల్ ఫోన్ లు మిస్సవ్వగా, అట్టి వివరాలు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ నెంబర్ను www.ceir.gov.in వెబ్సైటులో వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందుపరిచి 13 మంది ఫోన్లు రికవరీ చేసి వారికి అందించడం జరిగింది
ఈ సందర్భంగా సంపత్ రావు సిఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు తమ సెల్ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ కు సంబధిత వివరాలు www.ceir.gov.in వెబ్సైటులో వెళ్లి అందులో పూర్తిగా వివరాలు నమోదు చేసిన తరువాత వారి సెల్ఫోన్ ను పట్టుకోవడం జరుగుతుందని, ఈ సాంకేతికతను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version