రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణులు.. డిఫెన్స్ ప్యానల్ పచ్చజెండా…

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణులు.. డిఫెన్స్ ప్యానల్ పచ్చజెండా

 

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సుమారు రూ.10,000 కోట్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

న్యూఢిల్లీ: భారత రక్షణ రంగ పటిష్టత దిశగా మరో కీలక ముందడుగు పడింది. రష్యా నుంచి 288 ఎస్-400 (S-400) క్షిపణుల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సుమారు రూ.10,000 కోట్ల ఒప్పందానికి (AoN) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో (FTP) జరిగే ఈ కొనుగోళ్లలో 120 స్వల్ప శ్రేణి క్షిపణలు, 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణలు ఉన్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్ జరిగిన మరో రెండు ఎస్-400 వ్యవస్థలు ఈ ఏడాది జూన్, నవంబర్‌లో భారత్‌కు అందనున్నాయి
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఉపయోగించిన క్షిపణుల నిల్వలను పునరుద్ధరించడం, వాయి రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడం తాజా కొనుగోళ్ల ముఖ్య ఉద్దేశంగా డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. ఇదేవిధంగా చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద భారత వాయు రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, 400 కిలోమీటర్ల పరిధిలో వైమానిక ముప్పును సమర్ధవంతంగా ఎస్-400 వ్యవస్థ అడ్డుకుంటుందని పేర్కొన్నాయి.పాకిస్థాన్‌తో గత ఏడాది తలెత్తిన ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 వ్యవస్థ శత్రువుల వెన్నులో చలిపుట్టించింది. 314 కిలోమీటర్ల దూరంలోని పాక్ యుద్ధ విమానాన్ని కుప్పకూల్చింది. ఆదంపూర్, భుజ్ సెక్టార్లలో ఈ వ్యవస్థను మోహరించడంతో పాక్ గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ యుద్ధ విమానాలను ఆప్ఘనిస్థాన్, ఇరాన్ సరిహద్దులకు తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం కొనుగోలు చేయనున్న 400 కి.మీ, 200 కి.మీ, 150 కి.మీ, 40 కిలోమీటర్ల శ్రేణి క్షిపణులు శత్రువుల విమానాలు, డ్రోన్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టగలవు.

 విజయవంతంగా హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్.. ఎలైట్ క్లబ్‌లో భారత్…

 విజయవంతంగా హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్.. ఎలైట్ క్లబ్‌లో భారత్

 

యుద్ధ సమయంలో భారత యుద్ధ విమాన పైలట్లు ఇకపై ఆకాశంలో ఎంత ఎత్తుకెళ్లినా వారి ప్రాణాలకి ఢోకా లేదు. ఈ సాంకేతిక కోసం ఇప్పటి వరకూ విదేశాలపై ఆధారపడిన భారత్.. ఇక స్వయంగా తన పైలట్లను రక్షించుకోగలదు. దీనికి సంబంధించి చేసిన టెస్ట్ విజయవంతమైంది.

రక్షణ సాంకేతికతల్లో భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్‌పై హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది.

ఇది.. భారత్‌ను ప్రపంచంలోని ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్ టెస్టింగ్’ ఎలైట్ క్లబ్‌లోకి తీసుకెళ్లిన ఘనత సాధించింది. ఈ క్లబ్‌లో ఇప్పటివరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఐదవ దేశంగా మారింది.ఈ విజయం భారత రక్షణ వ్యవస్థకు భద్రతనిస్తుంది. ఎమర్జెన్సీలో యుద్ధ విమానం నుంచి పైలట్‌ను సురక్షితంగా బయటకు పంపుతుంది. దీని ద్వారా భారత పైలట్లకు ప్రపంచంలోనే అత్యుత్తమ రక్షణ హామీ లభిస్తుంది.కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయాన్ని ప్రశంసిస్తూ, ‘భారత్‌కు డిఫెన్స్ కెపాబిలిటీలో ఇది మరో మైలురాయి. డిఫెన్స్ R&D విభాగం, DRDO, IAF, ADA, HALలను అభినందిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. DRDO చైర్మన్ సమీర్ వి. కామత్ కూడా టీమ్‌ను అభినందించారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version