చెప్పుతో కొడుతూ.. బూతులు తిడుతూ..

చెప్పుతో కొడుతూ.. బూతులు తిడుతూ.. యువకుడిపై ట్రాన్స్ జెండర్ల దాష్టికం

 

దేశంలోని పలు రైల్వే స్టేషన్స్ లో ట్రాన్స్ జెండర్లు బెదిరించి డబ్బులు వసూల్లు చేయడం, బండబూతులు తిడుతూ దాడులకు తెగబడటం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఓ రైల్వే స్టేషన్‌లో బేంచ్ పై పడుకున్న యువకుడిని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అవుతుంది.

దేశంలోని పలు రైల్వే స్టేషన్స్ లో ట్రాన్స్ జెండర్లు బెదిరించి డబ్బులు వసూల్లు చేయడం, బండబూతులు తిడుతూ దాడులకు తెగబడటం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఓ రైల్వే స్టేషన్‌లో బేంచ్ పై పడుకున్న యువకుడిని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అవుతుంది.ఈ మధ్య కాలంలో ట్రాన్స్ జెండర్లు చేస్తున్న పనుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు పలు ప్రభుత్వాలు ట్రాన్స్ జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు ట్రాన్స్ జెండర్ల ఆగడాలు, దాడులు మితిమీరిపోతున్నాయి. ఓ రైల్వే స్టేషన్‌ (railway station)లో బెంచ్ పై పడుకున్న ఓ యువకుడిని ముగ్గురు ట్రాన్స్ (Transgenders) జండర్లు చెప్పుతో దాడి (Attack with Sandal) చేస్తున్న వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వైరల్ వీడియోలో ఓ యువకుడు రైల్వే స్టేషన్ లోని ఓ బెంచ్ పై నిద్రిస్తున్నాడు. హఠాత్తుగా అక్కడికి ముగ్గురు ట్రాన్స్ జెండర్లు వచ్చారు. వారిలో ఓ ట్రాన్స్ జెండర్ ఆ యువకుడిని లేపి తిడుతూ చెప్పుతో కొడుతుంది. ఏం జరుగుతుంతో అర్థం కాక ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ అవుతూ.. నన్ను ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించాడు. అంతలోనే మరో ట్రాన్స్ జెండర్ అతన్ని చెంపపై కొడుతుంది. ఇంత జరుగుతున్నా పక్క నుంచి ప్రయాణికులు వెళ్తున్నారే కానీ.. ఏం జరిగిందని ప్రశ్నించడం లేదు. చివరికి.. ఆ యువకుడు భయంతో అక్కడ నుంచి పారిపోతుండగా అతన్ని వెంబడించారు.వరాహ వారియర్ అనే యూజర్ X లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం (Netizens Serious) వ్యక్తం చేస్తున్నారు. రాను రాను రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులకు భద్రత లేకుండా పోతుందని.. పోలీసులు ఇలాంటి ఘటనలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలుసుకోవడానికి స్టేషన్ పేరు, బాధితుడి కాంటాక్ట్ నెంబర్, వివరాలు పంపించాల్సిందిగా రైల్వే పోలీసులు (Railway Police) ప్రజలను కోరారు. ఇందులో పాల్గొన్న వ్యక్తులను గుర్తిస్తూ పోలీసులు లేదా రైల్వే అధికారులు ప్రకటనలు జారీ చేయలేదు.

ఆ రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా..

ఆ రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

కురుపాం, అనంతపురం ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి, అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి.

 కురుపాం, అనంతపురం ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి, అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. కురుపాం గిరిజన బాలికల గురుకులంలో విద్యార్థులకు అస్వస్థతపై మంత్రితో మాట్లాడారు సీఎం చంద్రబాబు. పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనపై అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి.

సీఎం ఆదేశాల మేరకు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి పరామర్శించనున్నారు మంత్రి సంధ్యారాణి. పార్వతీపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్‌తో పాటు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వెళ్తున్నట్లు సీఎంకు వివరించారు మంత్రి సంధ్యారాణి. అనంతపురంలో శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డ మృతిపై మంత్రి సంధ్యారాణితో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఈ రెండు ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version