నెక్కొండలో టాస్క్ ఫోర్స్ దాడులు
రేషన్ బియ్యం పట్టివేత
#నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని చిరుధాన్యం కొనుగోలు కేంద్రంలో బియ్యం దందాను కొనసాగిస్తుండగా మంగళవారం టాస్క్ ఫోర్స్ సిఐ పవన్ నెక్కొండ ఎస్సై మహేందర్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు ఈ దాడులలో నెక్కొండ మండలంలోని చిరుధాన్యం కొనుగోలు వ్యాపారస్తుడు నిలువుంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి సంబంధిత సివిల్ సప్లై అధికారులకు అప్పగించి సంబంధిత వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు నెక్కొండ ఎస్సై మహేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నెక్కొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.