10వ వార్డులో పిట్ట స్వప్న దేవేందర్ గెలుపు ప్రచారం…

10వ వార్డులో పిట్ట స్వప్న దేవేందర్ గెలుపు ప్రచారం

ఆపదలో ముందుండే వ్యక్తి స్వప్న దేవేందర్

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని మాదారం కాలనిలో నిరుపేద కుటుంబానికి చెందిన గూడెల్లి మల్లమ్మ కాన్సర్ వ్యాధితో బాధపడుతుంది.పేద కుటుంబం కావడంతో ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న 10వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పిట్ట స్వప్న-దేవేందర్ భాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు.ఎన్నికల వేల ఓటర్లను వల వేసుకోవడానికి మధ్యం మాంసం పంపిణి చేస్తున్న నాయకులను చూసాం కానీ గెలుపోటములు లెక్క చేయకుండా పేద కుటుంబాలను ఆదుకునే మహాత్తర కార్యక్రమాలు చేస్తున్న స్వప్న -దేవేందర్ లాంటి నాయకులను చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడంటే ప్రజలకు సేవ చేసే వాడై ఉండాలని కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రజలు మాకు అవకాశం ఇస్తే 10వార్డ్ అభివృద్ధితో పాటు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని నిత్యం ప్రజల మధ్యే ఉంటామని హామీ ఇచ్చారు.భేశాజ్వలాలకు పోకుండా కుల మతాలకు అతీతంగా ప్రజా సేవకు అంకితం అవుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు శ్యామ్,చెరుకు సుధాకర్, బుస్స చిన్న భద్రయ్య, మంద సదానందం,గూడెల్లి దశరధం,గూడెల్లి రాజా రమేష్,మంద నాగరాజు,కోగిల శ్యామ్,కాలనీ వాసులు గూడెల్లి శివకుమార్, కొమురయ్య, సరోజన తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version