ఘనంగా శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు కోట రాజబాబు గౌడ్ గ్రంధాలయ సంస్థ చైర్మన్..

ఘనంగా శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు కోట రాజబాబు గౌడ్ గ్రంధాలయ సంస్థ చైర్మన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతిని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ
శ్రీపాదరావు ధన్వాడ గ్రామ సర్పంచ్‌గా మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికై, గ్రామానికి ఉత్తమ పంచాయతి అవార్డులు తెచ్చారు. మహాదేవ్పూర్ సమితి అధ్యక్షుడు, భూతనఖా బ్యాంకు చైర్మెన్‌గా పనిచేసి ప్రజలకు సేవలందించారు.మంథని ప్రాంతంలో అభివృద్ధికి, ప్రజాసేవకు జీవితాంతం కట్టుబడి ఉండి, నక్సల్స్ చేతిలో ప్రాణాలు వదిలాడు
కాంగ్రెస్‌లో పార్టీ గుర్తింపు
1983, 1985, 1989లో మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌తో మూడుసార్లు గెలిచి శాసనసభ్యుడయ్యారు. 1984లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గా, 1989-1994 మధ్య శాసనసభ స్పీకర్‌గా నిష్పాక్షికంగా పనిచేసి అన్ని పార్టీల మన్ననలు పొందారు స్వపక్షం, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు కల్పించి స్పీకర్ పదవికి వన్నె తెచ్చారు వారు అన్నారు

10వ వార్డులో పిట్ట స్వప్న దేవేందర్ గెలుపు ప్రచారం…

10వ వార్డులో పిట్ట స్వప్న దేవేందర్ గెలుపు ప్రచారం

ఆపదలో ముందుండే వ్యక్తి స్వప్న దేవేందర్

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని మాదారం కాలనిలో నిరుపేద కుటుంబానికి చెందిన గూడెల్లి మల్లమ్మ కాన్సర్ వ్యాధితో బాధపడుతుంది.పేద కుటుంబం కావడంతో ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న 10వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పిట్ట స్వప్న-దేవేందర్ భాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు.ఎన్నికల వేల ఓటర్లను వల వేసుకోవడానికి మధ్యం మాంసం పంపిణి చేస్తున్న నాయకులను చూసాం కానీ గెలుపోటములు లెక్క చేయకుండా పేద కుటుంబాలను ఆదుకునే మహాత్తర కార్యక్రమాలు చేస్తున్న స్వప్న -దేవేందర్ లాంటి నాయకులను చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడంటే ప్రజలకు సేవ చేసే వాడై ఉండాలని కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రజలు మాకు అవకాశం ఇస్తే 10వార్డ్ అభివృద్ధితో పాటు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని నిత్యం ప్రజల మధ్యే ఉంటామని హామీ ఇచ్చారు.భేశాజ్వలాలకు పోకుండా కుల మతాలకు అతీతంగా ప్రజా సేవకు అంకితం అవుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు శ్యామ్,చెరుకు సుధాకర్, బుస్స చిన్న భద్రయ్య, మంద సదానందం,గూడెల్లి దశరధం,గూడెల్లి రాజా రమేష్,మంద నాగరాజు,కోగిల శ్యామ్,కాలనీ వాసులు గూడెల్లి శివకుమార్, కొమురయ్య, సరోజన తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version