ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు…

ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు

మాజీ స్పీకర్ కు నివాళి అర్పించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీ పాదరావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించగా, కలెక్టర్ గరీమ అగర్వాల్ .. హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్ర పటానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాందాస్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలలో కలెక్టర్ చైర్మన్..

అసెంబ్లీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలలో కలెక్టర్ చైర్మన్

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావు జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ చైర్మన్ మీడిదొడ్డి మాదవి జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రజల సమస్యలపై పోరాడిన వ్యక్తి అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావుఅని అన్నారు
కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి న వారిలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ మున్సిపల్ చైర్మన్ మీడీదొడ్డి మాదవి రమేష్ జిల్లా అధికారులు ఉన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ యాదయ్య,, క్రీడలు యువజన శాఖ అధికారి సుధీర్ రెడ్డి ఏ ఓ భాను ప్రకాష్, డిపిఆర్ఓ సీతారాం, అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version