ఆపదలో ఉన్నా వారికి అండగా ఉంటాం

ఆపదలో ఉన్నా వారికి అండగా ఉంటాం

ట్రస్ట్ తరపున 22500 రూపాయలు ఆర్ధిక సాయం

*దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు.

*జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్

మంగపేట నేటిధాత్రి

ఇటీవల కాలం లో కమలాపురం గ్రామానికి చెందిన బందెల లక్ష్మీ ఆరోగ్యం బాగోలేక చనిపోయింది చాలా బీద కుటుంబం ఎవరు లేరు ఈమె కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు కోడలు బయట పని చేస్తూ పిల్లలను ఈమెను చూసుకుంటుంది కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు ఈమె దహణసంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు వాట్సాప్ గ్రూపులలో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు ఆ వాట్సప్ గ్రూపులలో ఉన్న వారు కొంతమంది దాతల సహాకారం తో ఈ రోజు కర్మలు ఉండటంతో వీరోకి దాతల దగ్గర నుంచి సేకరించిన 22500 రూపాయలు ఈ కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ మాట్లాడుతూ

ఈ విషయం గురించే కాకుండా ఎవరికైనా ఆపద ఉంది అని జ్వాలా ట్రస్ట్ దృష్టికి వస్తే కచ్చితంగా మా జ్వాలా ట్రస్ట్ దాతలసహకారం తో సహాయం అందిస్తుందని ఇప్పటి వరకు ప్రతీ ఒక్క కారిక్రమానికి సహాయం అందించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా మా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ తరుపున నా తరుపున పాదాభివందనం తెలియజేస్తున్నాం అంతేకాకుండా సహాయం అని అడిగిన వారికి మీకు తోచినంత సహాయం అందించాలని మనం చేసే సహాయం ఆ దేవుడు మనకు తిరిగి ఏదోఒక రూపంలో తిరిగి ఇస్తాడు మనం చేసే చిన్న సహాయం వారికి అది చాలా పెద్దదని చెప్పారు ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ గౌరవసలహాదారులు సోమేపల్లి భార్గవ్ చౌదరి మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

10వ వార్డులో పిట్ట స్వప్న దేవేందర్ గెలుపు ప్రచారం…

10వ వార్డులో పిట్ట స్వప్న దేవేందర్ గెలుపు ప్రచారం

ఆపదలో ముందుండే వ్యక్తి స్వప్న దేవేందర్

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని మాదారం కాలనిలో నిరుపేద కుటుంబానికి చెందిన గూడెల్లి మల్లమ్మ కాన్సర్ వ్యాధితో బాధపడుతుంది.పేద కుటుంబం కావడంతో ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న 10వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పిట్ట స్వప్న-దేవేందర్ భాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు.ఎన్నికల వేల ఓటర్లను వల వేసుకోవడానికి మధ్యం మాంసం పంపిణి చేస్తున్న నాయకులను చూసాం కానీ గెలుపోటములు లెక్క చేయకుండా పేద కుటుంబాలను ఆదుకునే మహాత్తర కార్యక్రమాలు చేస్తున్న స్వప్న -దేవేందర్ లాంటి నాయకులను చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడంటే ప్రజలకు సేవ చేసే వాడై ఉండాలని కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రజలు మాకు అవకాశం ఇస్తే 10వార్డ్ అభివృద్ధితో పాటు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని నిత్యం ప్రజల మధ్యే ఉంటామని హామీ ఇచ్చారు.భేశాజ్వలాలకు పోకుండా కుల మతాలకు అతీతంగా ప్రజా సేవకు అంకితం అవుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు శ్యామ్,చెరుకు సుధాకర్, బుస్స చిన్న భద్రయ్య, మంద సదానందం,గూడెల్లి దశరధం,గూడెల్లి రాజా రమేష్,మంద నాగరాజు,కోగిల శ్యామ్,కాలనీ వాసులు గూడెల్లి శివకుమార్, కొమురయ్య, సరోజన తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version