జాతీయ రహదారి విస్తరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి…

జాతీయ రహదారి విస్తరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

జాతీయ రహదారి 63 విస్తరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని మందమర్రి మండలం తిమ్మాపూర్ ప్రాంతంలో ఆర్మూర్ నుండి చంద్రాపూర్ జాతీయ రహదారి 63 పనులను మండల తహసిల్దార్ సతీష్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం మందమర్రి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు తీరును మండల తహసిల్దార్ సతీష్,మున్సిపల్ కమిషనర్ రాజలింగులతో కలిసి పరిశీలించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని,అంతర్గత రహదారులు,మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు.ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి తడి,పొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలని,మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను నిబంధనలకు లోబడి చేపట్టేలా అవగాహన కల్పించాలని,నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్ను,ఇతర పన్నులను 100 శాతం వసూలు చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డును సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.నివాసాల నుండి సేకరించిన చెత్తలో ఉపయోగకరమైన వాటిని వేరుచేసి సెగ్రిగేషన్ షెడ్ కు తరలించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version